మూడేళ్లు గడిచిపోయాయి కానీ, రాజైన అహాబు మాత్రం దేవుని వెంబడించని మొండివాడిగా, దుర్మార్గుడుగానే కొనసాగాడు. దేవుని వైపు తిరగడానికి బదులు అతడు బయలు దేవతకు, మరిన్ని విగ్రహాలు కట్టించాడు. మరొకసారి దేవుడు ఏలీయాను రాజుగారి దగ్గరకు పంపి "నీవు ఇంకా బయలు దేవతనే ఎందుకు పూజిస్తున్నావు?జీవము గల నిజ దేవునికి, అసలు దేవుడే కాని ఆ బయలు దేవతకు మధ్య మనం పోటీ పెట్టుకుందాం రా. దీనితో ఏ దేవుడు నిజమైనవాడో శాశ్వతంగా తేలిపోతుంది" అని చెప్పమన్నాడు.
రాజైన అహాబు ఈ పోటీకి సమ్మతించి, ఇశ్రాయేలు నాయకుల నందరినీ ఒక పెద్ద పర్వతం మీదికి రమ్మని చెప్పాడు. రాజు ఇప్పుడు బయలు దేవతను నమ్ముతున్న వందలాది యాజకులను కూడా తెచ్చాడు. వాళ్ళు రెండు బలిపీఠాలను కట్టారు ఒకటి దేవునికి, మరొకటి బయలుకు ఆ బలిపీఠాల మీద వాళ్ళు కట్టెలు కుడా పేర్చారు.
ఏలీయా ఆ కట్టెలు తీసుకొని, "కట్టెలకు నిప్పు అంటించకండి. మీ దేవుడైన బయలుకు ప్రార్ధనచెయ్యండి. అతడు నిజంగా దేవుడైతే, బలిపీఠం మీద ఉన్న కట్టెలు మండేలా చేస్తాడు. తర్వాత నేను జీవముగల దేవునికి ప్రార్ధన చేస్తాను. ఇప్పుడు మనం ఒక అంగీకారానికి వద్దాం. ఏ దేవుడైతే ఆకాశం నుంచి అగ్ని కురిపిస్తాడో అతడే నిజమైన దేవుడని ఈ రోజునుంచి మనం నమ్ముదాం" అని చెప్పాడు.
బలిపీఠం మీద అగ్ని పుట్టించమని వందలాది యాజకులు బయలు దేవతను బ్రతిమాలుకున్నారు. కానీ ఏమి జరగలేదు. ఏలీయా వాళ్ళని రెచ్చగొట్టడం మొదలు పెట్టాడు. "పెద్దగా కేకలు వేయండి!" అతడు నిజంగా దేవుడే! బహుశా దీర్ఘాలోచనలో ఉన్నాడో,లేదా ప్రయాణంలో ఉన్నాడేమో బహుశా నిద్రపోతున్నాడేమో లేపండి" అన్నాడు అయినా సరే ఏమి జరగలేదు. బయలు దేవుడు కాదు, కేవలం ఓ రాయి, కొయ్య ముక్క, మనుషుల ఉహల్లో నుంచి పుట్టినవాడు మాత్రమే .
1రాజులు 18
-నవీన్ కుమార్ యెలుమర్తి -
No comments:
Post a Comment