సొలొమోను రాజు, తర్వాత దేవుని గురించి అస్సలు పట్టించుకోని చాలా మంది చెడ్డరాజులు వచ్చారు. పైగా వారు రాళ్లతో,కొయ్యతో చేసిన అనేక రకాల విగ్రహాలను కట్టించారు. వారితో అత్యంత దారుణమైన రాజు అహాబు. తన రాజ్జములో ప్రజలంతా బయలు అనే దేవతను పూజించాలని తీర్మానం చేశాడు. దాదాపు అందరూ రాజుగారి ఆజ్ఞకు లోబడ్డారు, ఎందుకంటే ఎవడైతే దేవుని పూజించడం విడిచిపెట్టడో వానిని చంపేస్తానని ప్రకటించాడు రాజు.
అయితే ఇశ్రాయేలు దేశంలో నిజమైన దేవునియందు నమ్మకం ఉంచినవారు ఏడువేలమంది ఉన్నారు, వారిలో ఏలీయా ఒకడు. అహాబు దగ్గరకు వెళ్లి మీరు దేవునికి లోబడి, బయలు దేవతను పూజించడం ఆపెయ్యాలని చెప్పమని దేవుడు ఏలీయాకు చెప్పాడు. అయితే అహాబు ఏలీయా మాట వినడానికి ఇష్టపడలేదు గనుక దేవునికి చాలా కోపం వచ్చింది. అందువల్ల ఇశ్రాయేలు మీద చాలాకాలం వరకు వర్షం కురవకుండ ఆపి, దేవుడు అహాబు రాజుని, ఇశ్రాయేలు దేశాన్ని శిక్షించాడు. తినడానికి ఏదైనా దొరకడం చాలాకష్టమైంది. రాజైన అహాబు ఏలీయాను చంపాలనుకున్నాడు. ఎందుకంటే అతడు దేవుని ప్రవక్త. అయితే ఏలీయా అహాబు ప్రవక్త అయితే ఏలీయా, అహాబు,రాజుకు దూరంగా చాలా క్షేమముగా ఉన్నాడు. అతడొక నిర్మానుషమైన ప్రాంతంలో దాక్కున్నాడు. అక్కడ మనుషులెవరూ లేరు .
అనేక నెలలుగా వర్షం లేకపోవడం వల్ల ఆ దేశం అంతా ఎండిపోయింది, కానీ ఏలీయా మాత్రం చక్కగా ప్రవహించే ఒక సెలయేరు ప్రక్కన క్షేమంగా ఉన్నాడు. ప్రతి రోజు ఉదయాన్నే పెద్ద పెద్ద పక్షులు ఏలీయాకు రొట్టె ముక్కలు, మాంసం తీసుకొస్తాయి గనుక తినడానికి సరిపోయినంత ఆహారం వుంది ఈ విధంగా అతడు దుర్మార్గుడైన రాజు సైనికుల కంట బడకుండా దాగియున్నంత కాలం దేవుడు తాను పంపిన పక్షులు సహాయంతో ఏలీయాను పోషించాడు.
1రాజులు 17
-నవీన్ కుమార్ యెలుమర్తి -
No comments:
Post a Comment