సౌలు చనిపోయినప్పుడు ప్రజలు దావీదును తమ కొత్త రాజుగా ఎన్నుకొన్నారు. దావీదు మహారాజు గొప్ప రజ్జాన్ని కట్టుకుని, ఇశ్రాయేలువారి అనేక శత్రువులను ఓడించాడు. అతడు యెరూషలేమును కూడా వశపరుచుకొని ఆ నగరంలో తన పెద్ద రాజభవనాన్ని కట్టించాడు. దావీదు దేవుని వెంబడించి ఆయన మాటకు లోబడినాడు గనుక మంచి అయ్యాడు. దావీదుకు అనేక విషయాల్లో నైపుణ్యం ఉంది. అతడు గొప్ప యోధుడే గాక చక్కని సంగీత విధ్వంసుడు, అద్భుతమైన కవి కూడాను. దావీదు సితార వాయించి, దేవుని ప్రేమ గురించి, మన జీవితాలలో ఎదురయ్యే కష్టాలలో దేవుని నమ్మడం గురించి చాలా పాటలు రాశాడు.
దావీదు కుమారుడైన సొలొమోను దావీదు తర్వాత రాజయ్యాడు. మంచి రాజుగా జ్ఞానంతో పరిపాలించడం కోసం తనకు జ్ఞానం ఇవ్వమని దేవునికి ప్రార్ధన చేశాడు గనుక సొలొమోను చాలా జ్ఞానియైన రాజు అయ్యాడు. సొలొమోను ఎంతో జ్ఞానము గలవాడంటే అనేక ఇతరదేశ ప్రజలు కూడా అతని జ్ఞానం కోసం విని, అతన్ని కలవడానికి, అతని జ్ఞానవాక్కులు వినడానికి ఎంతో దూరప్రాంతాల నుంచి కూడా వచ్చేవారు.
దేవుడు సొలొమోనుని గొప్ప ధనవంతుడిగా కుడా చేశాడు, ఇశ్రాయేలును పరిపాలించిన రాజులందరికంటే ఎక్కువ సంపద అతనికున్నది. అయితే సొలొమోను తమ సంపాదనంతా అతని కోసమే ఖర్చుపెట్టుకోలేదు యెరూషలేములో మొట్టమొదటి దేవాలయాన్ని కట్టడానికి కుడా ఆ సంపదను ఉపయోగించాడు. ఇది యెరూషలేములో ప్రత్యేకమైన దేవాలయం, దానిని కట్టడానికి చాల ఖర్చయింది. అందులో ఉన్నదంతా బంగారం,వెండి, దగదగ మెరిసే ముత్యాలతో పోతపోశారు. అందులో ఉండే వస్తువులన్నీ కూడా బంగారంతో చేసినవే. దేవాలయ నిర్మాణం ముగిశాక, సొలొమోను దానిని అధికారికంగా ఆరంభించినప్పుడు ఏడు రోజుల పాటు పెద్ద విందు జరిగింది.
1రాజులు 2-10
-నవీన్ కుమార్ యెలుమర్తి-
No comments:
Post a Comment