Thursday, 4 October 2018

12 SPIES (పన్నెండు మంది గూఢచారులు)

అనేక నెలలు ప్రయాణం చేసిన తర్వాత ఇశ్రాయేలీయులు కనాను సరిహద్దుల దాకా వస్తారు. చాలా సంవత్యరాల క్రితం దేవుడు అబ్రాహాము,ఇస్సాకు,యాకోబులకు ఇస్తానని వాగ్దానం చేసిన దేశమే ఈ కనాను. దేవుడు మోషేతో "ఈ దేశం ఎలావుంటుందో చూడటానికి కొంతమంది మనుషులను పంపు" మని చెప్పాడు. మోషే పన్నెండు మందిని ఎన్నుకుని, వారు వెళ్లి ఆ దేశం మంచిదేనేమో చూచి, అక్కడి సైన్యం బలమైనదా కాదా తెలుసుకుని రమ్మని చెప్పి పంపాడు. 

   కొంతకాలం తర్వాత ఆ మనుషులు పాళేనికి తిరిగివచ్చారు. "అది చాలా అద్భుతమైన దేశమే గాని మనము కనానులో ప్రవేశించలేము, ఎందుకంటే అక్కడి ప్రజలు గొప్ప శూరులు, మహా యెధులు" అని చెప్పారు గూఢచారులు. ప్రజలు ఈ మాటలు విన్నప్పుడు భయపడ్డారు. వాళ్ళు మోషేతో "నీవు మమ్మల్నేందుకు ఈ ఎడారిలోకి తీసుకొచ్చావు? మేము ఐగుప్తులో ఉన్నప్పుడే క్షేమముగా ఉన్నాం" అంటూ ఫిర్యాదు చేయటం మొదలు పెట్టారు.  

    అయితే ఆ గూఢచారులలో యెహోషువ, కాలేబు అనే ఇద్దరు మాత్రం "భయపడకండి దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, ఆయన మనకు సహాయం చేస్తాడు!. అని చెప్పారు. కానీ ప్రజలు ఇంకా భయపడుతూ, వాళ్ళ మాటలు వినడానికి ఇష్టపడలేదు. అప్పుడు దేవుడు ఇశ్రాయేలీయుల మీద కోప్పడ్డాడు. ఎందుకంటే దేవుడు సహాయం చేస్తాడని వాళ్ళు నమ్మడం లేదు. అందుకని దేవుడు వాళ్ళతో ఇలా అన్నాడు. "మీరు భయపడి నన్ను నమ్మడం లేదు గనుక నేను ఇప్పుడే మీకు ఈ వాగ్దాన దేశాన్ని ఇవ్వను. మరో నలభై సంవత్యలు మీరు ఎడారిలోనే ఉండాలి. మీ అందరిలో కేవలం యెహోషువ, కాలేబు మాత్రమే నన్ను నమ్మారు గనుక, వాళ్లిద్దరే వాగ్దాన దేశంలో ప్రవేశిస్తారు."

                                                                                                                             సంఖ్యాకాండము 13-14
-నవీన్ కుమార్ యెలుమర్తి -
                                                                                                                                

No comments:

Post a Comment