ఇశ్రాయేలీయులో సమూయేలు అనేక సంవత్యరాలు నాయకుడిగా ఉండి, ప్రజలకు దేవున్ని వెంబడించాలని బోధించాడు. అతడు మంచివాడు దేవుణ్ణి ప్రేమించాడు. అయితే సమూయేలు పెద్దవాడు అవుతున్నాడు. ఇశ్రాయేలీయులు వాళ్లకి ఓ కొత్త నాయకుడు కావాలని అడిగారు వాళ్ళకి కావలసింది కేవలం నాయకుడు కాదు, తక్కిన రాజ్జల వాళ్లందరికీ రాజులు ఉన్నట్లు గానే వాళ్ళకి కూడా నిజమైన రాజు కావాలని కోరుకున్నారు. కాబట్టి సమూయేలు ఎలాగైనా ఒక రాజు కాగలిగిన వ్యక్తిని వెదకి ఇశ్రాయేలును నడిపించాలని కోరారు. సమూయేలుకు ఇద్దరు కొడుకులున్నారు గాని వాళ్ళు యథార్థవంతులు లేక న్యాయంగా ఉండేవాళ్ళు కాదు. గనుక వాళ్ళని నమ్మలేరు .
వాళ్ళకి బదులు, దేవుడు ఎన్నుకున్న రాజును సమూయేలు కనుగొన్నాడు, అతడు సౌలు అనే చూడముచ్చటైన యువకుడు. అతడు అందరికంటే భుజాలకు పైగా ఎత్తుగా ఉండేవాడు, మంచి బలాఢ్యుడైన వీరుడు. అతడు నిజంగా తమకు గొప్ప రాజుగా ఉంటాడని ప్రజలు ఆశించారు. ప్రత్యేకంగా తమ బద్ధశత్రువైన ఫిలిష్తీయులను అతడు ఓడిస్తాడన్న ఆశతో వాళ్ళున్నారు. ఫిలిష్తీయులు ఇశ్రాయేలుకు క్రూరమైన శత్రువులు, పదేపదే ఇశ్రాయేలు మీద దాడులు చేస్తుండేవారు . రాక్షసుడు ఒకడు ఉండేవాడు. అతడు
ఫిలిష్తీ సైన్యంలో గొల్యాతు అనే రాక్షసుడు ఒకడు ఉండేవాడు. అతడు 9అడుగులు పైన ఎత్తుండేవాడు. అతడు ఇశ్రాయేలీయులను, దేవుడిని ఎగతాళి చేస్తున్నాడు. ప్రతిరోజూ, సౌలు సైన్యానికి దగ్గర్లో నిలబడి, ఎవడైనా వచ్చి తనతో యుద్ధం చేయమని సవాలు చేస్తుండేవాడు. "రండి, మీకు దమ్ముంటే నాతో పోరాడండి," అంటూ కేకలు వేసేవాడు. అయితే ఎవరు అతనితో పోరాడటానికి ఇష్టపడలేదు, ఎందుకంటే అతడు చాలా ఎత్తుగా బలంగా ఉండేవాడు. గనుక ఇశ్రాయేలు సైనికులంతా అతనికి భయపడ్డారు.
-నవీన్ కుమార్ యెలుమర్తి -
No comments:
Post a Comment