ఒకరోజు, ఫిలిష్తీయులు తమ దేవత అయిన దాగోను గుడిలో ఒక పెద్ద విందు ఏర్పాటు చేసారు. ఆ విందు జరిగే సమయంలో వాళ్ళకు సమ్సోనును ఆటపట్టించాలన్న దుర్మార్గపు ఆలోచన వచ్చింది. అందుచేత వాళ్ళు సమ్సోనును చెరసాలలో నుంచి తీసుకొచ్చారు. "మాకు వినోదం కలిగించడానికి సమ్సోనును బయటకు తీసుకురండి " అంటూ వాళ్ళు కేకలు వేశారు అక్కడ దాదాపు 3000 మంది ప్రజలు పోగై, మద్యం త్రాగుడు ఎక్కువయ్యే కొద్ది మరింత దుర్మార్గంగా తయారయ్యారు. ఆ భవనానికి ఉన్న స్థంబాల మీద నిలబడి వాటిమీద చేతులు వేసివున్న గుడ్డి సమ్సోనును చూచి ప్రజలు నవ్వుతూ, హేళనచేస్తూ, మానసికంగా గాయపరుస్తున్నారు.
అందరూ విందులు చేసుకుంటూ ఉన్నారు గాని సమ్సోను చెరసాలలో ఉండగానే అతని జుట్టు చాలావరకు పెరిగిందన్న సంగతి వాళ్ళు మరచిపోయారు. సమ్సోను తన జీవితంలో చివరిసారిగా దేవునికి ప్రార్ధన చేశాడు , "దేవా, ఈ ఒక్కసారి నాకున్న శక్తిని మరొకసారి తిరిగి ఇవ్వు అని బ్రతిమాలాడు".
దేవుడు సమ్సోను పై జాలి చూపి మరల బలవంతుణ్ణి చేశాడు . సమ్సోను తన బలంకొద్ది నెట్టాడు. ఆ పెద్ద స్థంబాలు విరిగిపోవడం మొదలై, పై కప్పు అందరిమీద ఒక్కసారిగా కూలిపోయింది. గుడిలో ఉన్న అధికారులమీద, ప్రజలందరిమీద ఆ గుడి పడిపోయిది. ఆ విధంగా సమ్సోను బ్రతికి ఉన్నప్పటికంటే చనిపోయేటప్పుడు ఎక్కువమందిని చంపేశాడు. అతడు ఇశ్రాయేలుకు 20 సంవత్యరాలు నాయకుడిగా ఉన్నాడు. ఈ సారి సమ్సోను బ్రతికే అవకాశం దేవుడు ఇవ్వలేదు గానీ పరలోకంలో స్థానాన్ని దక్కించుకున్నాడు.
న్యాయాధిపతులు 16
-నవీన్ కుమార్ యెలుమర్తి-
న్యాయాధిపతులు 16
-నవీన్ కుమార్ యెలుమర్తి-
No comments:
Post a Comment