మోషేలాగే, యెహోషువ కూడా మంచి ఇశ్రాయేలు నాయకుడు. అయితే యెహోషువ చనిపోయాక ఇశ్రాయేలీయుల దేవుని గురించి మరచిపోయారు. కాబట్టి ఇతర దేశాల సైన్యాలు ఇశ్రాయేలులో ప్రవేశించి వాళ్ళు ఆహారాన్ని, పశువులను దోచుకుపోయారు. అయితే ఇశ్రాయేలీయులు దేవుని క్షమాపణ అడిగి, ఆయనకు ప్రార్ధన చేయటం మొదలుపెట్టిన ప్రతి సారి దేవుడు వాళ్ళకి సహాయం చేసేవాడు. దేవుడు వాళ్ళకి సహాయం చేసే విధానమేమిటంటే, గొప్ప ధైర్యవంతులు, బాగా నైపుణ్యమున్న యోధుల్ని పంపేవాడు. ఈ గొప్ప నాయకుల్ని న్యాయధిపతులు అని పిలిచేవారు, వారిలో గిద్యోను ఒకడు.
దేవుడు తనకిచ్చిన పని చెయ్యడానికి మొదట్లో గిద్యోను భయపడ్డాడు. అతడు ఇశ్రాయేలును తన బలమైన శత్రవుల నుంచి ఎలా రక్షించగలడు?గిద్యోను దేవునితో "నీవు నన్ను నిజంగా ఓ నాకుడిగా ఉండాలని కోరుతున్నావని నాకు చూపించు, దాన్ని రుజువు చేయడం కోసం నాకొక సూచననివ్వు" అన్నాడు. అప్పుడు గిద్యోను ఒక నూలు గడ్డను నేల మీద పెట్టి, "ఈ రాత్రి, నేను నిద్రపోయినప్పుడు, ఈ ఉన్నిని మంచుతో తడిసిపోయేలా చేసి,నేలను మాత్రం పొడిగా ఉంచాలి" అని దేవునితో చెప్పాడు. ఉదయాన్నే గిద్యోను ఆ ఉన్నిని చూడడానికి బయటకెళ్ళి చూస్తే అది సరిగ్గా గిద్యోను అడిగినట్లే ఉంది.
అయితే గిద్యోనుకు ఇంకా భయంగానే ఉంది, గనుక మరుసటిరోజు రాత్రి ఆ ఉన్నిని మరల బయటపెట్టాడు. ఈ సారి దేవునితో "నన్ను క్షమించు, నీ దగ్గర నుంచి నాకు మరో సుచన కావాలి.రేపు ఉదయం ఉన్నుని పొడిగా ఉంచి నేలను తడుపు" అన్నాడు. అతడు నిద్రలేచినప్పుడు ఉన్ని పొడిగా ఉంది. గాని మంచు మాత్రం నేలా మీద అంతటా పడింది. ఇప్పుడు గిద్యోనుకు ఖచ్చితంగా తెలుసు, దేవుడు తనని ఇశ్రాయేలులో ఒక నాయకుడిగా, న్యా ధిపతిగా ఉండమని కోరుతున్నాడని.
న్యాయాధిపతులు 6
-నవీన్ కుమార్ యెలుమర్తి -
No comments:
Post a Comment