Thursday, 4 October 2018

JERICHO WALLS (యెరికో గోడలు )

దాదాపు నలభై సంవత్యరాలు తరువాత , ప్రజలు కనానులో ప్రవేశించాల్సిన సమయం వచ్చిందని దేవుడు నిర్ణయించాడు. ఇప్పుడు మోషే ముసలివాడయ్యాడు, పైగా తాను ప్రజలను వాగ్దాను దేశంలోనికి నడిపించబోవడం  లేదని కూడా అతనికి తెలుసు. అతనికి బదులుగా యెహోషువను ఇశ్రాయేలీయులకు కొత్త నాయకుడిగా ఎన్నుకున్నాడు. 
        అప్పుడు  వాళ్ళు యెరికో అనే పెద్ద పట్టణానికి  చేరుకున్నారు. ఆ పట్టణం చుట్టూ ఎతైన పెద్ద గోడ ఒకటి ఉంది. అయితే యెహోషువకు మాత్రం చింతలేదు, ఎందకంటే ఆ పట్టణాన్ని ఎలా జయిస్తారో దేవుడు ముందుగానే చెప్పాడు. కాబట్టి వచ్చే ఆరు రోజుల్లో ప్రతి రోజూ ఆ పట్టణం చుట్టూ తిరగాలని యెహోషువ తన సైన్యాలకు ఆదేశించాడు. 
       తర్వాత, ఏడవ రోజున పట్టణం చుట్టూ సైన్యాలకు ముందుండి నడిపిస్తున్న యాజకులు బూరలు ఊదాలని, ప్రజలేమో పెద్దగా కేకలు వెయ్యాలని చెప్పాడు. యెరికో గోడలన్నీ ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి. వెంటనే ఇశ్రాయేలీయులు తేలికగా ఆ పట్టణాన్ని వశపరచుకున్నారు. 
        చివరికి, ఇన్నేళ్ల పాటు ఎడారిలో ఉన్న తరువాత, ఇశ్రాయేలీయులు తమ సొంత భూమిని దక్కించుకున్నారు. ఎన్నో ఏళ్ల క్రితం అబ్రాహాముకు ఇచ్చిన వాగ్దానాన్ని దేవుడు ఇప్పటికి నెరవేర్చాడు. 

                                                                                  యెహోషువ 1-6 
-నవీన్ కుమార్ యెలుమర్తి-

No comments:

Post a Comment