Wednesday, 3 October 2018

TEN COMMANDMENTS (పది ఆజ్ఞలు )

 ఇశ్రాయేలీయులు ఆ పెద్ద ఎడారిలో తమ ప్రయాణం కొనసాగించారు. ఒక రోజు వాళ్ళు మోషే ఎక్కడైతే మండుతున్న పొదను చూశాడో, అదే కొండ దగ్గరకు వచ్చారు. అప్పుడు వాళ్లంతా తమ గుడారాలు అక్కడ వేసుకుని కొంతకాలం ఉండాలని నిర్నయయించుకున్నారు. వాళ్ళు తల పైకెత్తి చూడగానే ఒక పెద్ద మేఘం ఆ  పర్వతాన్ని కప్పేసింది. ఆ మేఘంలో నుంచి మెరుపులు మెరిశాయి. ఓ పెద్ద ఉరుము భూమిని కుదిపేసింది. ఆ పర్వతం మీద దేవుడున్నాడు.


         మోషే దేవునితో మాట్లాడడానికి పర్వతం మీదికి వెళ్ళాడు. దాదాపు నలభై రోజులు మోషే ఆ కొండ మీదే  ఉన్నాడు. దేవుడు అతనితో మాట్లాడాడు. తన ప్రజలు లోబడడానికి దేవుడు మోషేకి ధర్మశాస్త్ర నియమాలను ఇచ్చాడు. వీటిలో పది చట్టాలను దేవుడే స్వయంగా రెండు పెద్ద రాతి పలకలమీద చెక్కాడు ఈ చట్టాలను పది ఆజ్ఞలు అంటారు. ఈ పది ఆజ్ఞలు ఏమని చెబుతాయంటే. 

        1. దేవుడినే పూజించు 
        2. వేరొకరిని గాని వేరొకదానిని గాని పూజించ వద్దు 
        3. పూజించడానికి ఏ విధమైన విగ్రహమును గాని, బొమ్మను గాని చేసుకొనవద్దు 
        4. ఏడవ రోజున పరిశుద్ధంగా ఉంచి, ఆరు రోజుల్లో నీ పని చేసుకో 
        5. నీ తండ్రిని నీ తల్లిని గౌరవించు
        6. చంపవద్దు 
        7. నీవు పెళ్లి చేసుకున్నప్పుడు నీవు చేసిన ప్రమాణాలను భంగం చేయవద్దు 
        8. దొంగతనం చేయవద్దు 
        9. అబద్ధాలు చెప్పవద్దు 
       10. వేరొక వ్యక్తికి చెందిన దేనికోసము ఆశపడవద్దు . 
  
  మోషే ఈ పది ఆజ్ఞలను పాలెంలోనికి తీసుకువెళ్లి వాటిని చదివి ప్రజలకు వినిపించాడు. "మనము దేవుని ఆరాధించడానికి ఒక ప్రత్యేకమైన స్థలాన్ని కట్టబోతున్నాము. అది ప్రత్యేక్షపు గుడారము అనబడే పెద్ద అందమైన గుడారం" అని మోషే వాళ్ళతో చెప్పాడు. పాళెం మధ్యలోనే వాళ్ళు ఆ గుడారాన్ని నిర్మించారు దానికోసం రంగురంగుల తెరలు తయారుచేసి, గుడారాన్ని వెండి బంగారంతో అలంకరించారు. ప్రత్యేక్ష గుడారం నిర్మాణం అయిపోయినప్పుడు, ఒక మేఘం ప్రత్యక్షపు సరిగ్గా ఆ గుడారం పైనే ఆవరించి ఉంది. దేవుడు తమతో ఎల్లప్పుడూ ఉన్నాడని, ఆ మేఘం వారికి సంకేతంగా నిలిచింది .  

                                                                                                                                                                                                 నిర్గమకాండము 16-17
-నవీన్ కుమార్ యెలుమర్తి-



No comments:

Post a Comment