Friday, 5 October 2018

300 GIDEON'S MEN (300 మంది గిద్యోను మనుషులు )

మిద్యానీయుల మీద దాడి చేయడం కోసం గిద్యను వీలైనంత ఎక్కువ మందిని సైనికులుగా సమకూర్చుకున్నాడు. అనేక వేలమంది గిద్యోను సైన్యంలో చేరారు. అయితే ఆ సైన్యం చాలా పెద్దయిందని, వారిలో ఎక్కువ మందిని ఇంటికి పంపివేయాలని దేవుడు గిద్యోనుతో చెప్పాడు. నిజానికి, గిద్యోను తన సైన్యంలోనుంచి మనుషులను పంపివేయమని దేవుడు చాలా సార్లు అడిగాడు. చివరికి, గిద్యోనుకు మిగిలింది కేవలం 300 మంది మనుషులే. అయితే యుద్ధంలో గెలవడానికి వాళ్ళు చాలు అని దేవుడు గిద్యోనుకు భరోసా ఇచ్చాడు. 

         కేవలం 300 మందితో అంత పెద్ద మిద్యాను సైన్యాన్ని జయించడానికి దేవుని దగ్గర చాలా తెలివైన పథకమే ఉంది. సైన్యంలో ప్రతి ఒక్కడూ ఒక్కొక్క దివిటీ, ఒక మట్టి కుండ, ఓ కొమ్ము తీసుకువెళ్లాలని దేవుడు గిద్యోనుకు వివరించాడు. తమ దివిటీలను వెలిగించుకోవాలి గాని వాటిని మట్టి కుండలో దాచి పెట్టాలని గిద్యోను తన సైన్యకులకు ఆదేశించాడు. ఈ విధంగా వాళ్ళు ఎవరికంటా పడకుండా మిద్యాను శిబిరంలోకి జొరబడవచ్చన్న మాట. 
       తర్వాత గిద్యోనుసంకేతాన్ని అనుసరించి, అందరూ తమ మట్టికుండలను బద్దలుకొట్టేసారు. పెద్దగా ఊదుతున్న బూరల శబ్దం విన్న మిద్యానీయులు నిద్రలోనుంచి మేలుకున్నారు. వారావిధంగా లేచినప్పుడు కనిపించేలా గిద్యోను తన మనుషులను కొండా మీద కుడా నిలబెట్టాడు. ఆవిధంగా కొండలమీద వెలుతురు, పెద్దగొలగా వినబడుతున్న  కొమ్ము శబ్దం వింటుంటే, ఒక పెద్ద సైన్యమే వాళ్ళు చుట్టూ కమ్ముకుని ఉన్నట్లు, తప్పించుకోడానికి దారే లేనట్లు కనబడింది. 
      మిద్యానీయులు తమ గుడారాల్లోనుంచి తప్పించుకోడానికి ప్రయత్నిస్తూ పారిపోతారు. అయితే చీకట్లో ఒకరికి ఒకరు ఎదురై, అప్పటికే శత్రువులు తమ శిబిరంలో జొరబడి యుద్ధం చేస్తున్నారని భావించారు. అందుచేత, మిద్యానీయులు వాళ్లలో వాళ్లే కొట్లాడుకుని తమను తామే నాశనం చేసుకున్నారు. ఈ విధంగా దేవుడు గిద్యోనుకు అతని 300 మంది సైనికులకు చాలా పెద్ద సైన్యం మీద  మహా గొప్ప విజయాన్ని అందించాడు. 

No comments:

Post a Comment