Sunday, 30 September 2018

GOD'S CARE FOR THE PEOPLE (ప్రజలకు దేవుని సంరక్షణ )

ఇశ్రాయేలు ప్రజలు ఇప్పుడు ఒక పెద్ద ఎడారి ప్రాంతంలో ఒక చోటనుంచి మరో చోటకి తిరుగుతూ వున్నారు. ఎడారిలో ఉండమంటే చాలా వేడిగా, కఠినంగా ఉంటుంది గనుక ప్రజలు తినడానికి చాలినంత ఆహారం లేదని మోషేకు ఫిర్యాదు చేయటం మొదలు పెట్టారు. గనుక దేవుడు తన ప్రజలకు ఒక ప్రత్యేకమైన విధానంలో ఆహారం పంపాడు. ప్రతి రోజు ఉదయాన్నే వాళ్ళు నిద్రలేవగానే, నేలమీద మన్నా అనే తియ్యటి రొట్టె ముక్కలు పడిఉండేవి. తర్వాత మధ్యాహ్నం దేవుడు పూరేడు పక్షులను పాలెం లోనికి పంపేశాడు. వాటిని ఇశ్రాయేలీయులు సులువుగా పట్టుకొని తినేవాళ్లు.

      వాళ్ళు వెళ్లిన ప్రతిచోట దేవుడు ప్రజల్ని కాపాడుతూ, ప్రతి రోజు ప్రొద్దుటే ఆకాశం నుంచి తగినంత మన్నా పంపేవాడు . అయితే ఒక రోజు వాళ్లంతా ఒక చోటకి చేరుకున్నారు. కానీ అక్కడ త్రాగడానికి చుక్క నీరు లేదు. ప్రజలు మళ్ళి మోషేకి ఫిర్యాదు చేయసాగారు, "త్రాగడానికి మాకు నీళ్లివ్వు" అన్నారు.


        మోషే దేవునికి ప్రార్ధన చేసాడు. అప్పుడు దేవుడు అతనికి ఒక పెద్ద రాయిని చూపించి, "నీ కర్రతో ఆ రాయిని కొట్టు" అని చెప్పాడు మోషే దేవుడు చెప్పినట్లే చేశాడు, వెంటనే రాయిలో నుంచి నీళ్లు ఒక్క ఉదుటున ప్రవహించాయి. ఇప్పుడు ప్రజలు వాళ్లకి కావాల్సినంత నీరు త్రాగారు. మరొకసారి దేవుడు తన ప్రజలకు సహాయం చేసాడు.
                                                                                                                       నిర్గమకాండము 16-17

-నవీన్ కుమార్ యెలుమర్తి -

Saturday, 29 September 2018

CROSSING THE RED SEA (ఎర్ర సముద్రాన్ని దాటడం )

మోషే ఇశ్రాయేలుయలను ఐగుప్తు నుండి బయటకి నడిపిస్తున్నాడు. పగలు పూట దేవుడు తన ప్రజలకు ముందుగా ఒక దట్టమైన మేఘములోను, రాత్రివేళ ఒక మండే అగ్నిలోను వెళ్ళాడు. ఆ విధంగా తన ప్రజలను పగలు రాత్రి నడిపించాడు.మార్గంలో వాళ్లకి పెద్ద సముద్రం ఎదురయ్యింది. దాని పేరు ఎర్ర సముద్రం. అక్కడ వాళ్ళు గుడారాలు వేసుకున్నారు.అయితే, ఫరో తన నిర్ణయాన్ని బట్టి మనసు మార్చుకొని ఇశ్రాయేలీయులను మరలా ఐగుప్తుకు తీసుకు రమ్మని తన సైన్యాలను పంపాడు.


              ఇశ్రాయేలీయులు చాలా భయపడ్డారు . ఎందుకంటే వాళ్ళు పడవలు వేసుకుని సముద్రం దాటి ఫరో సైన్యాన్ని తప్పించుకొని వెళ్లే సమయం కుడా వారికి లేదు. మోషే, వాళ్ళతో ఇలా చెప్పాడు. "భయపడకండి,దేవుడు మనకు సహాయం చేస్తాడు." అప్పుడు దేవుడు ఒక బలమైన గాలిని పంపాడు, అది ఎంత గట్టిగ వీచిందంటే,నీళ్లు వెనక్కి వెళ్ళిపోయి ఇశ్రాయేలీయులకు విశాలమైన దారి ఏర్పడింది. ఆ దారి సముద్రం అవతలి వైపు వరకు ఏర్పడింది. ఇప్పడు ఇశ్రాయేలీయులు తమతో పాటు తీసుకు తెచ్చుకున్న జంతువులు,వస్తువులు అన్నీ తీసుకుని ఒక్కటి కుడా తడిసిపోకుండా ఫరో సైన్యాన్ని తప్పించుకుని పోగలిగారు.
      
       ఫరో సైన్యం సముద్ర తీరానికి చేరుకున్నప్పుడు వాళ్ళు కుడా సముద్రంలో అదే దారిని వెంబడించారు. అయితే సముద్రంలో బాగా లోతు ప్రాంతానికి చేరుకోగానే, నీళ్ళని వెనక్కి పట్టి ఉంచిన గాలి హఠాత్తుగా ఆగిపోయింది. సైన్యం సముద్రంలో చుక్కుపోయింది. నీళ్లు మరల ఉదృతంగా ప్రవహించే సరికి సైన్యం అంతా కొట్టుకుపోయింది. దేవుడు తన ప్రజల్ని ఫరో సైన్యం నుంచి రక్షించాడు.
                                                                           
                                                                                   నిర్గమకాండం 14
                                                                                                                  -నవీన్ కుమార్ యెలుమర్తి-




TEN PESTS (పది తెగుళ్లు )

మోషే వెళ్లి ఫరో ముందు నిలబడి, "దేవుడు తన ప్రజలు ఐగుప్తును  విడిచి వెళ్లాలని కోరుతున్నాడు"అని చెప్పాడు. కానీ ఫరో "కుదరదు" అని చెప్పాడు. పైగా   ఐగుప్తులకులకు ఒక నోటీసు పంపించాడు ఇశ్రాయేలీయులు ఇంకా కఠినంగా పని చెయ్యాలని ఆదేశించాడు.
    
      ఫరో తన మాట వినడానికి ఇష్టపడలేదు గనుక, దేవుడు ఐగుప్తుమీదికి తెగుళ్లు పంపాడు.  మొదట, దేవుడు ఐగుప్తులో ఉన్న నీళ్లును రక్తంగా మార్చాడు. నదులు,చెరువులు అన్ని రక్తంతో నిండిపోయాయి. త్రాగడానికి ఎక్కడ ఎవరికి మంచి నీళ్లు దొరకలేదు. అయితే ఫరో ఇంకా ప్రజలను పోనివ్వడు. 
     తర్వాత దేవుడు ఆ దేశమంతటిని కప్పలతో కప్పేసాడు. ఓ కప్పు మీద కాలెయ్యకుండా ఎవరూ నడవలేకపోయారు. ఫరో మోషేను పిలిచి, "  నేను నీ ప్రజలను పోనిస్తాను. అయితే ముందుగా ఈ కప్పులను తీసేయ్ " అన్నాడు. దేవుడు ఆ కప్పులన్నిటిని తీసేసాక , ఫరో మనసు మార్చుకుని మరల ప్రజలను పోనివ్వలేదు. 
     
      దేవుడు పంపిన మూడవ తెగులు నేల మీద నుంచి వచ్చిన మిన్నల్లులు, ఎక్కడ చూచిన మిన్నాళ్లే, గుంపులు గుంపులుగా వచ్చాయి. తర్వాత దేవుడు ఐగుప్తు మీదికి ఈగల దండును పంపాడు. ఇళ్ల నిండా ఈగలు చేరి, ప్రతి దాని మీద ముసురుకున్నాయి. అది ఐగుప్తు ప్రజలు భరించలేకపోయారు. చివరకు ఫరో  మోషేకు వాగ్దానం చేశాడు ప్రజలు వెళ్ళవచ్చని. అయితే ముందుగా ఈగలు పోవాలని. అయితే మరల దేవుడు ఈగలను,మిన్నాళ్ళు తీసివేయగా ఫరో మాట ఇచ్చినందుకు బాధపడ్డాడు.
              అప్పుడు దేవుడు "ఐగుప్తులో పశువులన్నిటికి రోగం వస్తుందని" చెప్పాడు. అలాగే జరిగింది అనేక జంతువులు చనిపోయాయి కుడా, అయితే ఇశ్రాయేలీయుల పశువులు ఒక్కదానికి కుడా రోగం రాలేదు, ఆరవ తెగులు దద్దుర్లు, ఐగుప్తు ప్రజల శరీరమంతా వ్యాపించాయి నిలబడాలంటే చాలా కష్టంగా ఉండటంతో రోజంతా పడుకునే  ఉండేవాళ్ళు. తర్వాత దేవుడు ఐగుప్తు మీదికి భయంకరమైన తుఫాను పంపించగా దానిలో పెద్ద వడగండ్లు కురిసి భూమి మీద ఉన్న ప్రతి మొక్కను,పంటను నాశనం చేశాయి. ఈ వడగండ్లు ఎంత పెద్దవంటే అవి ఇళ్ల పై కప్పుల మీద పడి రంధ్రాలు చేశాయి, రోజంతా వడగండ్ల వాన కురుస్తూనే ఉంది. ఐన సరే, ఇశ్రాయేలీయుల ప్రజలను ఐగుప్తీ విడిచి వెళ్ళడానికి ఫరో తిరస్కరించాడు. 
     
        అప్పుడు దేవుడు ఐగుప్తు మీద అంతటి మీదకి మిడతల దండును పంపాడు. ఒక్క మిడతతో ఎలాంటి సమస్య ఉండదు కాని, లక్షలాది మిడతలు ఒకేసారి దండులా వస్తే మాత్రం భయంకరమైన తెగులవుతుంది.  వడగండ్ల వాన తర్వాత మిగిలిపోయిన ప్రతి మొక్కను అవి తినేశాయి. 

        తర్వాత దేవుడు ఐగుప్తునంతా మూడురోజులపాటు చిమ్మ చీకటితో కప్పేశాడు. మిట్ట మధ్యాహ్నం వేళ కుడా చిమ్మ చీకటితో ఉండింది. అయినా, ఫరో ఇశ్రాయేలీయలను ఐగుప్తు విడిచి వెళ్లనివ్వలేదు.

            అప్పుడు దేవుడు మోషేతో ఇలా చెప్పాడు. "ఫరో త్వరలోనే మిమ్మల్ని పోనిస్తాడు. కాబట్టి నీవు వెళ్లి నీ ప్రజలను సిద్ధంగా ఉండమని చెప్పు. అదే రోజు ఐగుప్తులో ఉన్న ప్రతి తొలి బిడ్డ మరణించారు. ఫరో కొడుకు సైతం చనిపోయాడు. అయితే ఇశ్రాయేలీయులలో ఎవరు చనిపోలేదు. ఇది దేవుడు పంపిన పదో తెగులు, అన్నిటికన్నా దారుణమైనది. అదే రాత్రి ఫరో మోషేని కలిసి, "ఇంతవరకు నాకు జరిగింది చాలు. నీ ప్రజలను తీసుకుని వెళ్ళిపో" అని చెప్పాడు. హడావుడిగా ఇశ్రాయేలీయులు తమ సొంత వస్తువులన్నీ తీసుకుని ఐగుప్తు విడిచి వెళ్లిపోయారు. 
                           
                                                                                                                                                                                              నిర్గమకాండము 6-12
-నవీన్ కుమార్ యెలుమర్తి -                                                                                                        
            

Friday, 28 September 2018

MOSES - FIERY SHRUB (మోసి - మండుతున్న పొద )

         ఆ అబ్బాయి కొంచెం ఎదిగాక, అతన్ని యువరాణి ఉండే రాజా భవనానినికి తీసుకొచ్చారు. అక్కడే అతడు పెద్దవాడయ్యాడు, యువరాణి ఆ బిడ్డకు మోషే అని పేరు పెట్టింది. మోసే పెద్దవాడయ్యాక, అతడు ఇశ్రాయేలుయుడు అని తెలుసుకున్నాడు తన వాళ్ళు ఐగుప్తులో బానిసలుగా ఉన్న తీరు, వాళ్ళని ఎంత దారుణంగా చూస్తున్న విధానం చూచిన మోషేకి ఎంతో కోపం వచ్చింది. కాబట్టి తన ప్రజల్లో కొంతమందికి సహాయం చెయ్యాలని ప్రయత్నించాడు. ఈ విషయం ఫరోకు తెలిసినప్పుడు అతని  విపరీతంగా కోపపడ్డాడు. అందువలన మోషే తన ప్రాణాలు కాపాడుకోవటం కోసం ఐగుప్తు విడిచి పారిపోవాల్సి వచ్చింది. అతడు వేరొక దేశం వెళ్ళి, గొర్రెలు కాచుకుంటూ నలభై ఏళ్ళు అక్కడే ఉన్నాడు.

       ఒక రోజు మోషే శేష జీవితమంతటిని మార్చివేసి అతి ప్రాముఖ్యమైన సంఘటన ఒకటి జరిగింది. అతడు తన గొర్రెలను కాచుకుంటూ ఒక కొండవైపు తేరిచూస్తున్న సమయంలో అకస్మాత్తుగా అతనికి పర్వతం మీద ఒక వింతైన పొద కనబడుతుంది ఆ పొద మంటల్లో చుక్కుకుంది కానీ కాలిపోవడంలేదు. 

     మోషే పర్వతం మీదకి ఎక్కిపోయి, పొదవైపు నడిచాడు. సరిగ్గా అదే సమయంలో, మండుతున్న ఆ పొదలోనుంచి దేవుడు అతన్ని పిలిచాడు. ఆ మంటల్లోనుంచి వస్తున్నట్లు అనిపించిన దేవుని స్వరం "దగ్గరకు రావద్దు. నీవు పరిశుద్ధమైన నేల మీద నిలబడ్డావు గనుక  నీ చెప్పులు తీసేయ్" అని చెప్పినట్లు వినబడింది. మోషే చాలా భయపడ్డాడు.           

       దేవుడు మోషేతో "భయపడకు, నేను నీకు తోడుగా ఉన్నాను. నా ప్రజలైన ఇశ్రాయేలీయులు ఐగుప్తులో బాధపడటం  నేను చూశాను. నేను వాళ్ళని మరువలేదు. ఇశ్రాయేలీయులు నా ప్రజలని,వాళ్ళు ఐగుప్తు విడిచివెళ్లాలని ఫరోకు చెప్పా. మోషే, వాళ్ళని నీవు ఐగుప్తులో నుంచి బయటకునడిపించాలి" అన్నాడు అయితే మరల ఐగుప్తు వెళ్ళడానికి మోషే భయపడ్డాడు . 
  
        అప్పుడు మోషే  దేవునితో అన్నాడు, "ఈ మాటలు ఫరోతో చెప్పడానికి నేనేపాటివాడను? నేను కేవలం ఓ గొర్రెల కాపరిని, నేను ఇశ్రాయేలీలుయులను నడిపించలేను." యితే దేవుడు "నేను నిన్ను క్షేమముగా కాపాడతాను. నీ చేతి కర్రను తీసుకుని ఐగుప్తులో అద్భుతాలు జరిగిచడానికి దాన్ని ఉపయోగించు" అని చెప్పాడు. నేను అబ్రాహాముకు వాగ్దానం చేసిన కానను   దేశంలోకి నీవు వాళ్ళని నడిపిస్తావు. ఇప్పుడు వెళ్ళు,నేను నీకు తోడుగా ఉంటాను" అని చెప్పాడు.మోషేకి ఇంకా భయంగానే  ఉంది కానీ , దేవునికి విధేయుడయ్యి వెళ్ళాడు. 

                                                                                                                               నిర్గమకాండం 3              
-నవీన్ కుమార్  యెలుమర్తి  -

Thursday, 27 September 2018

MOSES IN THE BASKET (బుట్టలో ఉన్న మోషే)

యేసేపు అతని కుటుంబము చనిపోయాక కుడా. ఇశ్రాయేలులుగా పిలవబడిన అతని సంతానం ఐగుప్తులోనే ఉండిపోయారు .
అయితే యేసేపు చనిపోయాక  ఇశ్రాయేలీయలకు పరిస్థితులు అనుకూలంగా లేవు. ఫరోలనబడే కొత్త రాజులకు ఇశ్రాయేలీయులు నచ్చ లేదు గనుక వాళ్ళని ఐగుప్తులో బానిసలుగా చేశారు. వాళ్ళు చాలా కష్టపడి ఎక్కువసేపు పనిచేయవలసి వచ్చేది. కానీ తినడానికి సరిపోయినంత ఆహారం ఉండేది కాదు. 
       ఇశ్రాయేలీయలకు ఏంతో  మంది పిల్లలు పుట్టి వాళ్లంతా ఐగుప్తువాళ్ళకంటే ఎక్కువై. తమ రాజ్జాన్ని స్వాధీనం చేసుకోడానికి ప్రయత్నిస్తారేమోనని దుర్నర్గుడైన ఫరో భయపడ్డాడు. అప్పుడతడు భయంకరమైన క్రూరమైన నిర్ణయం తీసుకుని ఒక శాసనం చేశాడు. ఇశ్రాయేలుయలకు చెందిన మగ పిల్లలందచేసింది రినీ చంపేయాలన్నదే ఆ శాసనం. ఇశ్రాయేలీయులు ఫరోకి భయపడి సహాయంకోసం దేవునికి ప్రార్ధన చేశారు. 

     ఒక ఇశ్రాయేలు స్త్రీ ఓ మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఫరో సైనికులకు కనబడకుండ ఆ బిడ్డను కాపాడలనుకొని, పడవలాగా ఒక తేలే బుట్టను తయారు చేసింది తర్వాత తన బిడ్డని ఆ బుట్టలో పెట్టి దాన్ని నైలు నదిలోకి పంపింది. ఏం చెయ్యాలో ఆమెకు తెలియలేదు. ఇక తన బిడ్డను కాపాడే బాధ్యత దేవునిదే. 

     ఆ చిన్నవాడి అక్క మిర్యాము దాక్కుని, నదిలో తేలుతూ వెళుతున్న బుట్టను గమనిస్తూ ఉంది. ఆ బుట్ట నీళ్లపై తేలకుండా ఎక్కడ మునిగిపోతుందోనని ఆ అమ్మాయి ఒకటే ఆందోళన చెందుతోంది. అయితే అప్పుడే ఫరో కుమార్తె అయిన యువరాణి ఆ బుట్టను చూచి, అందులో అందులో బిడ్డ ఉన్నట్లు కనుగొన్నది. ఆ పసివాణ్ణి చూచి, ఆమె ఇష్టపడి, "నేను ఈ బిడ్డను తీసుకుంటాను. వీడు నా కుమారుడవుతాడు" అని చెప్పింది.


కానీ అంత చిన్న బిడ్డకు ఆహారం ఎలా ఇస్తుంది ? ఆవిషయమే తన చుట్టూ ఉన్న సేవకురాళ్లతో ఆమె చర్చిస్తుంది.. మిర్యాము దాక్కుని ఉన్న చోటనుంచే ఈ సంబాషణ విని పరిగెత్తుకుంటూ వెళ్లి యువరాణితో ఈ మాట చెప్పింది. "ఈ బిడ్డకు ఆహారం ఇవ్వగల ఒక ఆమె నాకు తెలుసు" వెంటనే యువరాణి ఆమె సహాయానికి కృతజ్నతలు చెప్పి, ఆ బిడ్డని తన అక్కకే తిరిగి ఇచ్చేసింది. తన తమ్ముణ్ణి తీసుకుని ఇంటికి వెళ్తున్నందుకు మిర్యాము ఎంతో  సంతోషించింది, బిడ్డ చిన్నవాడిగా ఉన్నంత కాలం తల్లే  జాగ్రత్తగా పోషించింది. తన పసివాణ్ణి  దేవుడు అంత క్షేమముగా కాపాడినందుకు తల్లి దేవునికి వందనాలు చెప్పింది. 
 
                                                                                                                                                                                              నిర్గమకాండము 1-2


-నవీన్ కుమార్  యెలుమర్తి  -                                                                            

Monday, 24 September 2018

JOSEPH BROTHERS IN EGYPT ( ఐగుప్తులో యేసేపు అన్నలు )

    కచ్చితంగా, యేసేపు రాజుగారికి వివరించినట్లే, అక్షరాలా జరిగింది. ఐగుప్తులో ఏడేండ్ల పాటు పంటలు బాగా పండాయి. ఆ తరువాత చెడ్డ సంవత్యరాలు వచ్చాయి. పంటలు నష్టపోయాయి ఒక్క ఐగుప్తులోనే కాదు ప్రపంచమంతటా కరువు సంభవించింది. త్వరలోనే పుకార్లు షికార్లు చేశాయి. ఐగుప్తులో ఆహారం దొరుకుతుందని.
        అక్కడ కాననులో కూడా యాకోబు అతని కుమారులు ఆకలితో అలమటిస్తున్నారు. తినడానికి ఏమి లేదు కాబట్టి ధాన్యం కొనడానికి వృధుడైన యాకోబు తన కుమారులను ఐగుప్తునికి పంపిస్తాడు. అన్నలకు ఆ విషయము తెలియదు, కానీ ఇప్పుడు వాళ్ళు ధాన్యం కొనడానికి వెళ్లి కలవాల్సిన వ్యక్తి వాళ్ళు చాలా సంవత్యరాలు క్రితం బానిసగా అమ్మేసిన వాళ్ళ చిన్న తమ్ముడే.

     ఈ సహోదరులు యేసేపు వద్దకు వచ్చినప్పుడు అతని ఎదుట ఎంతో గౌరవభావంతో సాగిలపడతారు. యేసేపు వెంటనే తన అన్నలను గుర్తుపడతాడు - కానీ వాళ్ళు అతన్ని గుర్తుపట్టలేకపోయారు. ఎందుకంటే యేసేపు ఐగుప్తు రాజవస్త్రాలు ధరించి ఉన్నాడు. యేసేపు తన గురించి వాళ్లకు తెలియనివ్వకుండా, వాళ్లకు కావాల్సిన ధాన్యం కొనడానికి అనుమతించాడు

    ఎంతోకాలం గడవకముందే, ఈ అన్నలు మరింత ధాన్యం కొనడానికి మరల ఐగుప్తునకు రావల్సివచ్చింది. ఈ సారి
వాళ్ళు యేసేపు కోరిక మేరకు అందరికంటే చిన్నవాడైన బెన్యామీనును తమతో పాటు తీసుకొచ్చారు. మరొకసారి వాళ్లంతా యేసేపు ఎదుట సాగిలపడ్డారు. అనేక సంవత్యరాలు క్రితం సరిగ్గా యేసేపు ఇదే కలగన్నాడు. అయితే ఈ సారి తన తమ్ముడైన బెన్యామీనును చూసేసరికి తన కన్నీళ్లు ఆపుకోలేకపోయాడు. 

         నేను యేసేపుని. మీరు ఐగుప్తువారికి బానిసిగా అమ్మేసిన మీ తమ్ముడినే. నన్ను చూసి భయపడకండి. మీరు నాకు కీడు చేశారు గాని దేవుడు దానిని మేలుగా మార్చాడని యేసేపు తన అన్నలతో అన్నాడు.

       అప్పుడు యేసేపు తన తమ్ముడైన బెన్యామీనును హత్తుకుని ముద్దుపెట్టుకుని ఆనందంతో ఏడ్చేశాడు. అలాగే తన అన్నలందరినీ కుడా ముద్దు పెట్టుకొని, "మీరు వెళ్లి నాన్నని కూడా మీతో పాటు తీసుకుని రండి, మనమంతా కలసి మరల ఒక పెద్ద కుటుంబముగా ఇక్కడే ఉందామని వాళ్ళకి చెప్పాడు. యేసేపు తండ్రి, అన్నలు వస్తున్నారని తెలిసిన ఐగుప్తు రాజు వాళ్ళు నివసించడానికి వీలుగా ఐగుప్తులో ఒక చక్కని ప్రాంతాన్ని వాళ్ళకిస్తాడు .
   ఐగుప్తులో యేసేపు అన్నలు



                                                                                                                           ఆదికాండము 37-47
- NAVEENKUMAR YELUMARTHI -

Sunday, 23 September 2018

BECOME THE LEADER OF THE SLAVE (బానిస నుండి నాయకుడిగా)

ఐగుప్తులో, బానిసగా ఉన్న యేసేపు కొంత కాలములోనే చెరసాల పాలయ్యాడు. తోటి ఖైదీలలో ఒకడు  రాజు గారితో కలసి అతి సన్నితంగా పనిచేసేవాడు. ఒక రాత్రి అతనికి ఒక కల వచ్చింది, దాన్ని అతడు యేసేపుతో చెప్పాడు. దాని భావమేమిటో యేసేపుకు తెలుసు. గతంలో నీవు రాజుగారి ప్రత్యేక సేవకుడివి. నీ కలకు అర్ధమేమిటంటే, త్వరలోనే నీవు మరల అతని సేవకుడవు అవుతావు "

      మూడు రోజుల తరువాత, యేసేపు చెప్పినట్లే జరిగింది అతడు విడుదల చేయబడి రాజుగారికి సేవలు చేయడానికి తిరిగి రాజ భవనానికి వెళ్ళిపోయాడు. 

       రెండేళ్లు గడచిపోయాయి. అయితే యేసేపు ఇంకా చెరసాలలో ఉండిపోయాడు. ఆ సమయంలో ఐగుప్తు  రాజుకి కొన్ని వింత కలలు వచ్చాయి. అవి అతడినెంతో బయపెట్టాయి. ఒక రోజు రాత్రి రాజు గారు నైలు నది ఒడ్డున నిలబడి నట్లు కల కన్నాడు. హఠాత్తుగా నదిలో నుండి బలిసిన ఆవులు బయటకొచ్చాయి. వాటిని బక్క చిక్కిన  ఆవులు తినేశాయి. కొంత సేపటి తరువాత అతనికి అతనికి మరొక కల వచ్చింది. అతడు ఏడు మొక్కజొన్న కంకులను చూశాడు. అవి చాలా మందంగా గింజలతో నిండి ఉన్నాయి. అయితే బాగా ఎండిపోయిన సన్నగా ఉన్న ఏడు కంకుల్ని కుడా చూశాడు. అప్పుడు పలుచటి కంకులు మందంగా ఉన్న కంకుల్ని తినేశాయి. 


       రాజు గారు ఈ కలలకు అర్థమేమిటో నిజంగా తెలుసుకోవాలనుకున్న్నాడు అప్పుడు ఆ సేవకుడు తాను చెరసాలలో కలిసిన యేసేపుని జ్ఞాపకం చేసుకున్నాడు. చెరసాల నుంచి యేసేపుని రాజుగారి ఎదుటకు తీసుకొచ్చారు. యేసేపు వెంటనే ఆ కలల భావన అర్ధం చేసుకొని వాటిని రాజుగారికి వివరించాడు. "త్వరలో సంభవించబోయే సంగతులు గురించి మీరు కలలు కంటున్నారు. వాటి అర్ధం ఇది. మొదట ఐగుప్తులో ఏడు సంవత్యరాలపాటు తినడానికి బోలుడంత ఆహారం ఉంటుంది. ఆ తర్వాత, ఏడు సంవత్యరాలు అసలు పంటలే పండని చెడు సంవత్యరాలు వస్తాయి."

      యేసేపు మరొక సలహా కూడా ఇచ్చాడు. రాజుగారి పెద్ద గిడ్డంగులు కట్టి, మంచి సంవత్యరాలలో పండే అదనపు ధాన్యమంతా సేకరించి దాచిపెట్టాలని, అలా చేయడం వలన కరువు సంవత్యరాలు వచ్చినప్పుడు అందరికి ఆహారం దొరుకుతుందని చెప్పాడు. యేసేపు చెప్పిన యోచన రాజుగారికి నచ్చింది. కాబట్టి మంచి సంవత్యరాలలో వీలైనంత ఎక్కువ ధాన్యం సేకరించడానికి యేసేపునే నియమించాడు. అప్పుడు యేసేపు
ఐగుప్తులో బలమైన నాయకుడు . 
             
                                                                                                                     ఆదికాండము 37-47
-NAVEEN KUMAR YELUMARTHI -   

Saturday, 22 September 2018

DREAMS ARE JOSEPH ( కలలు కనే యేసేపు )

యాకోబుకి పన్నెండు మంది కుమారులు , ఒక కూతురు ఉన్నారు. యేసేపు అతని చిన్న కొడుకుల్లో రెండోవాడు. యేసేపు అంటే యాకోబుకు ఎంతో ఇష్టం. కాబట్టి యేసేపు కోసం యాకోబు ఒక అందమైన కోటు తయారుచేశాడు. ఆ కోటు చాలా ఖరీదైనది గనుక యేసేపు యొక్క ఆ ప్రత్యేకమైన కోటు తన అన్నలకు ఎంతో అసూయ పుట్టించింది.  
    యేసేపుకు చాలా కలలు వచ్చాయి. ఒక రోజు యేసేపు ఒక కల కన్నాడు. అందులో అతడు, అతని అన్నలు గోధుమ పనలు కోస్తున్నారు. వాటన్నిటిని తన  కట్టలు కట్టారు. అయితే యేసేపు అన్నల కట్టలు తన కట్టలకు నమస్కారం చేశాయి . 


    మరొకసారి యేసేపు సూర్యుడిని, చంద్రుడిని పన్నెండు నక్షత్రాలను చూచినట్లు కలగన్నాడు, ఆ నక్షత్రాలలో ఒకటి యేసేపుది కాగా, తక్కిన నక్షత్రాలన్నీ యేసేపు నక్షత్రానికి నమస్కారం చేశాయి. యేసేపు తన కొచ్చిన కలలు గురించి తన అన్నలకు చెప్పినప్పుడు వాళ్ళు చాలా కోప్పడ్డారు. ఎందుకంటే వాళ్ళకు అతని కలలు నచ్చలేదు. వాళ్ళన్నారు, " అయితే నీవు మా తమ్ముడు అయినప్పటికీ మేమంతా నీ ముందు సాగిలపడటం నీకు బాగానే ఉందనుకుంటున్నావా? ఇలాంటి కలలు ఇంకా కంటూనే ఉండరా చిట్టి తమ్ముడూ."
అప్పటినుంచి వాళ్ళు యేసేపు పీడ వదిలించుకోవాలని తీర్మానించుకున్నారు. 

          ఒక రోజు , యేసేపు , అతని అన్నలు ఇంటికి చాలా దూరంగా ఉన్నప్పుడు, వాళ్ళు యేసేపును పట్టుకుని అతని అంగీలు చింపేసి, ఒక నీళ్లులేని బావిలో  పడేశారు.  ఆ దారి వెంట కొంతమంది వ్యాపారస్తులు వెళ్తుంటే, అన్నలు యేసేపును పైకి లాగి, ఆ మనుషులకు అతన్ని బానిసగా అమ్మేశారు. వాళ్ళు ఐగుప్తునికి ప్రయాణిస్తున్నారు, చివరికి అక్కడే యేసేపు ఒక బానిసగా అయ్యాడు. అయితే దేవుడు యేసేపుని మరచిపోలేదు, ఆయన అతన్ని కాపాడినాడు. 
                                                                                                                        ఆదికాండము 37-47

-నవీన్ కుమార్  యెలుమర్తి -

JACOB'S FAMILY ( యాకోబు కుటుంబము )

చివరికి, యాకోబు లాబాను ఇంటికి చేరుకున్నాడు. లాబాను చాలా ధనవంతుడు, అతనికి వందలాది గొర్రెలు,మేకలు ఆవులు ఉన్నాయి. యాకోబు లాబాను దగ్గర పనిచేస్తూ, అతని పశువులు మేపుతూ 20 సంవత్యరాలు గడుపుతాడు. లాబాను ఇద్దరు కూతుళ్లు అయిన రాహేలు,లేయాలను కూడా యాగోబు పెళ్లి చేసుకుంటాడు, అతనికి మొత్తం మీద పండ్రెండు మంది పిల్లలు పుడతారు. యాకోబు చాలా ధనవంతుడవుతాడు, అనేక ఆవులు గొర్రెలు మేకలు సంపాదిస్తాడు

అయితే యాకోబు తిరిగి కనాను వెళ్లాలనుకుంటాడు. అతడు మరల తన అన్నతోను, కుటుంబముతోను ఉండాలని ఆశిస్తాడు. యాకోబు మరల ఇంటికి వస్తున్నాడని తెలిసిన ఏశావు యాకోబుకు ఒక వర్తమానం పంపిస్తాడు. 
''నేను నాలుగు వందల మందిని తీసుకుని వస్తున్నాను" అని యాకోబుకు చెప్పి పంపిస్తాడు. ఏశావు ఇంకా నా మీద కోపంతోనే ఉన్నాడని యాకోబు భయపడ్డాడు. కాబట్టి అతడు తన సేవకులతో ఏశావుకు కొన్ని బహుమానాలు పంపిస్తాడు అలాగైనా తన అన్న కోపం చల్లారుతుందనే ఆశతో . 


     అయితే ఏశావు యాకోబును క్షమించాడు. యాగోబును కలవడానికి అతడు పంపిన మనుషులు కేవలం యాకోబు మందలకు సహాయంగా ఉంటారని పంపాడు. ఏశావు యాకోబును చూడగానే పరిగెత్తుకుంటూ,వెళ్లి అతన్ని కౌగలించుకుని ముద్దుపెట్టుకున్నాడు. 

        వాళ్లిదరు ఏడ్చారు, యాకోబు ఏశావుని మోసం చేసి, అతనికి విపరీతమైన కోపం తెపించినా, ఏశావు అతన్ని క్షేమించి తన తమ్ముడిని మరల చూడగలిగినందుకు చాలా సంతోషించాడు. అతడు మరల వాళ్ళు కుటుంబమంతా కలిసి ఉండాలని కోరుకున్నాడు . 
                                                                                                                               


                                                                                                                                ఆదికాండము 25-33                           

-నవీన్ కుమార్ యెలుమర్తి  

JACOB'S DREAM ( యాకోబు కల )


యాకోబు తనతో పాటు తీసుకెళ్లగలిగినవన్నీ తీసుకుని చాలా దూరం ప్రయాణం చేసి, వేరే దేశంలో ఉంటున్న లాబాను అనే తన మేనమామ దగ్గర ఉంటూ పనిచేసుకోడానికి బయలుదేరాడు. తన ప్రయాణంలో ఒక రాత్రి, పూర్తిగా అలసిపోయిన యాకోబు ఒక రాయిని తలగడగా పెట్టుకొని గాఢ నిద్రలోకి జారుకుంటాడు. 









ఆ విధంగా  నిద్రలో ఉండగా అతనికో వింత అయిన కల వస్తుంది. అందులో ఒక నిచ్చెన ఆకాశం వైపు వెళుతుండటం చూశాడు దేవదూతలు ఆ నిచ్చెన మీద పైకి క్రిందికి వెళ్తూ ఉన్నారు దేవుడు ఆ నిచ్చెన పైభాగాన నిలబడి, "నీకు తోడుగా ఉండి, నిన్ను కాపాడి క్షేమముగా ఉంచుతాను. నీకు లెక్క పెట్టలేనంత పెద్ద కుటుంబము ఉంటుందని వాగ్దానం చేస్తున్నాను. మరియు నీ కుటుంబము ఈ ప్రపంచానికి ఒక అద్భుతమైన దీవెన ఇస్తుంది" అని యాకోబుతో చెప్పాడు.





   తెల్లారి ఉదయం యాకోబు నిద్ర లేచినప్పుడు "దేవుడు నాకు తోడుగా ఉండి నన్ను దీవించాలనుకున్నట్లు నాకిప్పుడు నిశ్చయంగా తెలుసు."అన్నాడు. అపుడు తాను తలగడగా పెట్టుకున్న ఆ రాయిని తీసుకుని దానిని నిలబెట్టి దానిపైన నూనెను పోసాడు. అదిప్పుడు దేవుడు యాకోబుతో కలలో మాట్లాడిన స్థలానికి గుర్తుగా ఉంది. 

                                                                                                                                    ఆదికాండము 25-33
-నవీన్ కుమార్ యెలుమర్తి - 

JACOB- ESAU (యాకోబు-ఏశావు)

ఇస్సకు, రిబ్కాలు ఒకరినొకరు ఎంతో ప్రేమించుకున్నారు,  త్వరలోనే వాళ్ళకి ఏశావు, యాకోబు అనే ఇద్దరు కొడుకులు పుట్టారు. వాళ్ళలో చిన్నవాడు యాకోబు.  వాళ్ళిద్దరూ కవల పిల్లలే కాని ఒకే రకంగా ఉండరు. ఏశావుకి చేతులు,కాళ్ళమీద ఒత్తుగా పొడవైన జుట్టు ఉండేది.  యాకోబు చర్మం చక్కగా , నునుపుగా ఉండేది. వాళ్ళు పెద్దవారయ్యాక , ఏశావు బయట తిరుగుతూ ,వేటాడడానికి ఇష్టపడేవాడు. యాకోబుకేమో ఇంటి  దగ్గరే ఉండటం ఇష్టం .


ఇస్సకు ఇప్పుడు బాగా ముసలి వాడయ్యిపోయాడు, ఒక రోజు అతని పెద్ద కొడుకైన ఏశావును పిలిచి, అతనితో  ఇలా అన్నాడు . " ఏశావు  నేనిపుడు ముసలివాడినయ్యను, ఇక మన కుటుంబాన్ని మరొకరు నడిపించవలసిన సమయం వచ్చింది. నువ్వు ఆయుధాలు తీసుకుని వేటకు వెళ్ళు. కొంత మాంసం తెచ్చి నాకు మంచి భోజనం తయ్యారు చెయ్యి. భోజనం తిన్నాక నేను నిన్ను ఆశీర్వదించి, మన కుటుంబానికి నిన్ను నాయకుడిగా చేస్తాను. "

ఇదంతా రిబ్కా విన్నది, ఆమె ఏశావుకంటే యాకోబును ఎక్కువుగా ప్రేమించింది కాబట్టి ఆ ఆశీర్వదాలన్ని యాకోబు కు దక్కాలని కోరుకుంది. అప్పుడామె యాకోబుతో ఇలా చెప్పింది . "నీవు వెంటనే వెళ్లి కొంత మాంసం సిద్ధపరచి, ఏశావు బట్టలు వేసుకును వెళ్ళు" యాకోబు చేతులు ఏశావు చేతుల్లాగ  ఉండాలని ఆమె ఒక చిన్న మేక వెంట్రుకలు తీసుకుని అతని చేతులకు పట్టించింది. 

అప్పుడు యాకోబు  ఆ మాంసాహారాన్ని ఇస్సాకు  దగ్గరకు తీసుకొచ్చి అతడే ఏశావు అన్నట్లు నటించాడు. ఇస్సాకు  యాకోబు బట్టలు వాసన చూసినప్పుడు అవి ఏశావు బట్టలు వాసనే వచ్చింది. పెద్దాయన యాకోబు చేతులను  తడిమి చూడగా అవి ఏశావు చేతుల్లాగే  అనిపించాయి అందుచేత, ఇస్సాకు యాకోబు చేతులో మోసపోయి , అతని ఆశీర్వదాలు ఏశావుకు బదులు యకోబుకే ఇచ్చేసాడు. 

ఇంతలో ఏశావు తన వేటను ముగించుకుని వచ్చి"నాన్న, నేను వేటకెళ్ళి తిరిగొచ్చాను నీకోసం అద్భుతమైన భోజనం తయారు చేశాను ఇప్పుడు, నీవు నాకు ఇస్తానని చెప్పిన ఆశీర్వాదాలు నాకివ్వు అన్నాడు.  అయితే ఇస్సాకు ఎవరు నీవు ? అని అడిగాడు . నేను నీ జేష్ట్రపుత్రుణ్ణి, ఏశావును అని ఏశావు బదులిచ్చా
డు. యకోబు వాళ్ళని మోసం చేసాడని ఇస్సాకు , ఏశావులకు అర్ధమైంది . ఏశావుకు చాల కోపం వచ్చి తన తమ్ముణ్ణి చంపేస్తానని  చెప్పాడు. 
రిబ్కా ఏశావు బెదిరింపు మాటలు విని,"నీవు వెంటనే ఈ ఊరు విడిచి కనాను దేశంలో ఉంటున్న మా అన్న లాబను వద్దకు వెళ్లి అతని దగ్గర ఉండాలి" అని యకోబును హెచ్చరించింది. అందుచేత,యాకోబు హడావుడిగా ఆ ఊరు వదిలి,ఏశావు కంటపడకుండ వీలైనంత వేగంగా వెళ్ళిపోవలసి వచ్చింది . 
                                                                                                                             ఆదికాండము 25-33
-నవీన్ కుమార్  యెలుమర్తి -

Friday, 21 September 2018

ISAAC WAS A WIFE ( ఇస్సాకునకు ఒక భార్య )

ఇస్సాకు పెద్దవాడయ్యాక , అబ్రాహాము అతనికి ఒక మంచి భార్యను తేవాలనుకున్నాడు. అందుచేత, అబ్రాహాము సేవకులలో ఒక నమ్మకమైన సేవకుణ్ణి పిలిచి, "ఇస్సాకు కోసం నువ్వు  ఒక భార్యను వెతకాలి. మేము ఏ దేశం నుండి వచ్చామో అక్కడికి వెళ్లి, నా సహోదరుడు నివసించు చోటికివెళ్లి, ఇస్సాకు భార్యగా ఉండగలిగే ఒక అమ్మయిని చూడు." అని చెప్పాడు. ఆ దాసుడు వెంటనే పది ఒంటెలు తీసుకుని ఒక పెద్ద ప్రయాణానికి బయలుదేరాడు.

   చివరికి అతడు నాహోరు అనే పట్టణం చేరుకున్నాడు . అతడు ఒంటెలకు బాగా దాహం వెసింది కాబట్టి ఒక బావి దగ్గర ఆగడు. ఆ దాసుడు దేవునికి ప్రార్ధన చేసి, ఇస్సాకునకు సరైన భార్యను వెతకడానికి సహాయం చేయమని అడిగాడు. "బావి నుంచి నీళ్లు  చేదుకోడానికి  స్త్రీలు వచ్చినప్పుడు, ఇస్సాకునకు సరైన భార్యగా ఉండగలిగే అమ్మాయని చూపించు. నాకు, నా ఒంటెలకు నీళ్లు ఇచ్చే అమ్మయే ఇస్సాకు భార్య అయ్యుండాలి." అని ప్రార్ధన చేసాడు. అప్పుడే ఒక చక్కని అమ్మాయి బావి దగ్గరకు వచ్చింది, ఆమె పేరే రిబ్కా

     రిబ్కా ముందుగా ఆ సేవకునికి నీళ్లు చేదిపోసింది, ఆ  తర్వాత అతని ఒంటెలకు నీళ్లు పెట్టడానికి సహాయం చేసింది.  ఆ సేవకుడు రిబ్కా వైపు చూస్తూ ఉన్నాడు. ఆమె ఇస్సాకునకు మంచి భార్యగా ఉంటుందని అర్ధమైపోయింది, ఎందుకంటే దేవుడు ఆమెను ఎన్నుకున్నాడు. 

  ఆ దాసుడు ఆమెకు ఒక ఉంగరం, రెండు చేతి కడియాలు ఇచ్చి, అదే రోజు రాత్రి రిబ్కా తండ్రిని అడిగాడు,  ఆమె ఇస్సాకును పెళ్లి చేసుకుంటుందా అని. రిబ్కా వాళ్ళ నాన్న సరే నని ఒప్పుకున్నాడు, మరునాడు ఆ సేవకుడు, రిబ్కా బయలుదేరి ఇస్సాకును కలవడానికి ప్రయాణమయ్యారు. రిబ్కా ఎవరి గురించి అయితే మంచి సంగతులు విన్నదో ఆ యువకుడైన ఇస్సాకును కలుసుకోడానికి  ఎంతో ఉవ్విళ్లూరుతోంది . 
                                                                                                                                       ఆదికాండము 24

-NAVEEN KUMAR YELUMARTHI- 


Tuesday, 18 September 2018

LAUGH (నవ్వు)

అబ్రాహాము శారను ఎంతగానో ప్రేమించాడు అయితే అబ్రాహాము. శారా దుఃఖిస్తున్నారు, ఎందుకంటే వాళ్ళకి పిల్లలు లేరు,పైగా శారా ఏమో ముసలామె అయిపోతుంది. అయితే ఒక రాత్రి దేవుడు అబ్రాహామునకు ఒక కొత్త వాగ్ధానం ఇచ్చి, అతనితో "అబ్రాహామా, ఆకాశం వైపు చూచి అక్కడ ఉన్న నక్షత్రాలన్నిటి లెక్కపెట్ట గలవేమో చూడు. నీ కుటుంబం కుడా లెక్కపెట్టలేనంత పెద్దదవుతున్నదని నీకు వాగ్దానం చేస్తున్నాను. నీ కుటంబము లోకానికి ఎంతో అద్భుతమైన పని ఒకటి చేస్తుంది " అని చెప్పాడు. శారాకి అప్పటికే పిల్లలు కలిగే వయస్సు మీరు పోయింది  గనుక, అది నమ్మడం కష్టమే అయినప్పటికీ దేవుడు తన వాగ్దానాన్ని నెరవేరుస్తాడని అబ్రాహాము దేవుణ్ణి నమ్మాడు .
       ఒకరోజు అబ్రాహాము బాగా ఎండకాచే వేళ తన గుడారం బయట కూర్చుని ఉన్నాడు. అతడు పైకి చూడగానే అక్కడికి దగ్గర్లో ముగ్గురు వ్యక్తులు నిలబడి ఉన్నట్లు కనబడింది. అబ్రాహాము చాలా ఉదార స్వభావం కలిగిన వాడు. అతిధులకు భోజనం  పెట్టడం అంటే ఆయనకు మహా ఇష్టం."మీరు ఏదైనా కాస్త తినాలనుకుంటున్నారా?" అని వాళ్ళని అడిగాడు. శారా వాళ్ళకి మంచి విందు సిద్దపరిచింది , వాళ్లంతా కలిసి విందు చేసాక, అకస్మాత్తుగా వాళ్ళు అబ్రాహాముతో ఒక వింతైన సంగతి చెప్పారు. "వచ్చే సంవత్యరం ఇదే సమయానికి నీకు నీ భార్య శారకి ఒక కుమారుడు పుడతాడు."
        ఈ మనుషులు దేవుని వద్ద నుండి వచ్చారని అబ్రాహాము గ్రహించాడు గనుక ఆ మాటలు నమ్మి దేవుణ్ణి మహిమ  పరిచాడు. అయితే శారా ఈ  మాటలు విన్నప్పుడు వాటిని నమ్మలేకపోయింది. ఆమె బిగ్గరగా నవ్వి, " నా వయస్సులో పిల్లలును కనడం ఎలా సాధ్యం ?" అనుకుంది అయితే శారా  నవ్వడం దేవుడు విని,"శారా ఎందుకు నవ్వింది దేవునికి అసాధ్యమైంది ఏమైనా ఉందా? " అని అడిగాడు. దేవుడు తన వాగ్దానాన్ని నిలబెట్టుకుని ఇచ్చిన మాట ప్రకారం సరిగ్గా ఒక సంవత్యరం తర్వాత వాళ్ళకి ఒక కొడుకును అనుగ్రహించాడు. అబ్రాహాము ఆ అబ్బాయికి ఇస్సాకు అని పెను పెట్టాడు. 
                                                                                                                              ఆదికాండము 12-23 












-నవీన్ కుమార్ యెలుమర్తి-




Monday, 17 September 2018

GOD CHOOSES ABRAHAM (దేవుడు అబ్రాహామును ఏర్పరచుకొనుట )


ఊరు అనే నగరంలో అబ్రాహాము అనే చాలా మంచి వ్యక్తి ఉండేవాడు అతడు ప్రపంచములోనే అత్యంత ధనికుడు. ఎంత ధనవంతుడంటే, అతనికున్న పశువులను గొర్రెలను, ఒంటెలను కాయడానికే కొన్ని వందల మంది పనివాళ్ళు అతనికి అవసరమయ్యేవాళ్ళు . దేవుడు అబ్రాహామును ఉన్నత స్థితిలో ఉంచాడు.

 








      ఒక రోజు అబ్రాహాముతో దేవుడు ఇలా అన్నాడు, "నీవూ నీ భార్య శారయి కానను  అనే మరొక దేశానికి వెళ్ళాలి. నీకోసం నీ కుటుంబము కోసం నాకొక ప్రత్యేకమైన యెచన  ఉంది ." వెంటనే అబ్రాహాము శారయి దేవుని మాటకు లోబడి, వారి కొత్త దేశానికి వెళ్లే ఒక సుదీర్ఘ ప్రయాణం ఆరంభించారు . వాళ్ళు కున్న పశువులను వస్తువులన్నిటినీ భద్రంగా చూచుకోవడం కోసం వాళ్ళ పనివాళ్ళందరూ కుడా బయలుదేర వలసి వచ్చింది. 
       వాళ్ళు అనేక సంవత్సరాలు ప్రయాణం చేసి అనేక ప్రాంతాలలో స్థిర పడుతూ, చివరికి దేవుడు అబ్రాహాముకు ఇస్తానని వాగ్దానం చేసిన కానను దేశానికి చేరుకుంటారు. హెబ్రోను అనే ప్రాంతంలో ఉన్న పెద్ద చెట్లకు దగ్గరలో వాళ్ళు తమ గుడారాలు వేసుకుంటారు. 

                                                                                                                                ఆదికాండము 12-23



                                                   
        -నవీన్ కుమార్  యెలుమర్తి -

LONG TOWER (పొడవైన గోపురం)

 జలప్రళయం  తర్వాత మళ్ళి ప్రపంచమంతా మనుషులతో నిండిపోయింది ప్రతి ఒక్కరు ఒకే భాషా మాట్లాడుతుండేవారు గనుక ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలంతా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ తెలికిగా అర్ధం చేసుకోగలుగుతున్నారు. ఒక రోజు చాలా మంది ప్రజలు ఒక పట్టణంలో చేరి, ఇలా అనుకున్నారు "మనం ఆకాశాన్నంటే ఒక పొడవైన గోపురం కట్టుదాం రండి, అప్పుడు భూమ్మీద నివసించే వాళ్ళందరి కంటే మనమే గొప్ప, అత్యంత ఘనమైన ప్రజలమని భవిష్యత్తులో అందరూ మనల్ని
గుర్తుపెట్టుకుంటారు  ."
         అయితే వాళ్ళు ఆ గోపురాన్ని కట్టడం దేవునికి ఇష్టం లేదు. ఆ గోపురం కట్టడం వెనుక వాళ్ళు ఉద్దేశమంతా కేవలం వాళ్ళెంత గొప్పవాల్లో చుపించుకోవడమే నని ఆయనకు తెలుసు . గనుక దేవుడు వచ్చి, వాళ్లందరికి కొత్త భాషను ఇచ్చి ఆ పనిని ఆపేశాడు. ప్రజలందరు ఒక్కసారిగా గందరగోళంలో పడ్డారు. ఎందుకంటే ఒకరికి ఒకరు అకస్మాత్తుగా ఎవరు ఏం మాట్లాడుతున్నారో  అర్ధం కావటం లేదు. ఒకరితో ఒకరు ఏం చెప్తున్నారో తెలియక వాళ్ళు కలిసి పని చేయకలేకపోయారు అంతటిలో వాళ్ళు ఆ పధకాన్ని వదిలేసారు. ఆ గోపురం ఇక ఎన్నటికీ పూర్తి కాలేదు.


                                                                                                                               ఆదికాండము 11
 
-నవీన్ కుమార్ యెలుమర్తి  -

RAINBOW IN THE SKY(ఆకాశంలో ఇంద్రధనస్సు )

     వర్షం ఆగిపోయాక ఓడ దాదాపు 6 నెలలు పాటు  నీళ్ల మీదనే చుట్టూ తిరుగుతూ ఉంది . నీళ్లు కొద్దిగా ఎండిపోయాయి గనుక ఇప్పుడు మళ్ళి కొండ శిఖరాలు కనబడుతున్నాయి అయితే లోయలు , పెద్ద పెద్ద అడవులు నిండా ఇంకా నీళ్లు ఉన్నాయి. ఒక రోజు ఓడ ఆరారాతు అనే పర్వతం ప్రక్కన ఆరిన నేలను తాకింది .
     నోవహు ఓడలో నుండి ఒక  కిటికీ తెరచి ఒక నల్ల కాకిని బయటకు  పంపాడు. ఆ పక్షిని అతడు బయటకి ఎగిరి పోయేలా చేసాడు కానీ దానికి ఆరిన నేల ఎక్కడా కనపడనందున అది వెంటనే నోవహు దగ్గరికి తిరికి వచ్చేసింది. ఆ తర్వాత నీళ్లు ఎండిపోయాయి లేదో తెలుసుకోడానికి నోవహు మరల ఒక పావురాన్ని బయటకు పంపాడు. క్రిందకి దిగడానికి స్థలము లేక అది కూడా మరల తిరిగి వచ్చేసింది . 
 ఒక వారం తరువాత నోవహు మరొకసారి ఆ పావురాన్ని బయటకి వదిలాడు అయితే ఈ సారి పావురం వెనక్కి తిరిగి రాలేదు , గనుక నోవహుకు తెలుసు, ఇక ఓడను విడచి బయటకు రావాల్సిన సమయం వచ్చేసింది అని. అప్పుడు దేవుడు "జలప్రళయం అయిపోయింది గనుక ప్రతి ఒక్కరూ ఓడను విడిచి బయటకు రావచ్చు" అని చెప్పాడు, నోవహు జంతువులన్నీ బయటకు పంపేశాడు . అవి వాటికోసం ఎదురు చూస్తున్న కొత్త ప్రపంచంలోకి వెళ్ళడానికి ఎంతో ఉత్సహంగా ఉన్నాయి . 
       
        తన కుటుంబాన్ని, జంతువులన్నిటిని క్షేమముగా కాపాడినందుకు నోవహు దేవున్ని ఆరాధించడానికి బలిపీఠం కట్టాడు. అప్పుడు దేవుడు నోవహు అతని కుమారులను దీవించి ఇలా అన్నాడు, "ఈ రోజు నేను మీకు ఒక వాగ్దానం చేస్తున్నాను. ఆకాశంలో నేను ఏర్పపాటు చేసిన ఇంద్రధనస్సును చుడండి. నేను మరల ప్రపంచాన్ని వరదలతో నాశనం చ్చెయ్యను  అనడానికి ఇ ది మీకు ఒక సూచినిగా ఉంటుంది ."
   ఇప్పటికి, ఆ తరవాత ఎపుడైనా వర్షం వచ్చినా, ఆకాశంలో నల్లమబ్బులు కమ్మినా, నోవహు అతని కుటుంబము కాస్త చింతిస్తూ ఉండేవారు. అయితే దేవుడు వాళ్లకు చేసిన వాగ్దానాన్ని  ఎన్నడూ మరువలేదు, వర్షం వెళ్ళిపోయాక సూర్యుడు మబ్బుల్ని చీల్చుకుని ప్రకాశించే సమయములో ప్రకాశవంతముగా మెరిసే రంగుల హరివిల్లు కనబడుతుంది  వాళ్ళు క్షేమముగా ఉన్నారు, దేవుడు తన వాగ్దానాన్ని నిలబెట్టుకుంటాడు ఎల్లప్పుడూ!                                                                                                                                                                                                                                                                                                                                            ఆదికాండము 6-2
                                                                                          
-నవీన్ కుమార్ యెలుమర్తి - 
                                                                                       

Saturday, 15 September 2018

THE BIG BOAT MADE OF NOAH & WATER FLOOD( నోవహు చేసిన పెద్ద పడవ & జలప్రళయం)

నోవహు చేసిన పెద్ద పడవ   :





అనేక సంవత్సరాలు గడిచి పోయాయి ,ఇప్పుడు భూమి నిండా మనుషులున్నారు . అయితే మనుషులు దేవుడు గురించి అంతా మరచిపోయారు, ఒకరికొకరు విపరీతమైన కీడు చేసుకుంటున్నారు. దీని వాళ్ళ దేవుడు ఎంతగానో దుఃఖపడ్డాడు. అందుకని భూమ్మీద ఎక్కడైనా ఒక మంచి వ్యక్తి కనబడతాడేమో చూడాలని ప్రయత్నించాడు .దేవుడు వెతికాడు కానీ ఒకే ఒక్క మంచి వ్యక్తిని కనుగొన్నాడు. అతని పేరే నోవహు  . నోవహు దేవుణ్ణి ప్రేమించి ఆయన మాట విన్నాడు .
     దేవుడు నోవహుతో ఒక పెద్ద ఓడను నిర్మించమని చెప్పాడు.  అది నోవహు కుటుంబాన్ని ప్రపంచంలో ఉన్న జంతువులు ప్రాణుల్లో   ఆడ మగ  జతలుగా పట్టేంత పెద్దది . " ఆ ఓడ నీ కుటుంబాన్ని నిన్ను, జంతువులను  జలప్రళయం   నుండి కాపాడి మిమ్మల్ని కాపాడి క్షేమముగా ఉంచుతుంది " అని దేవుడు చెప్తాడు .
నోవహు అతని ముగ్గురు కుమారులు షేము , హాము,యాపెతు ఓడను నిర్మిస్తూ ఎన్నో సంవత్యరాలు గడిపారు. దేవుడు నోవహుకు ఇచ్చిన చూచనలును తూ .చ. తప్పకుండా పాటించి ఓడను నిర్మిస్తారు .

 జలప్రళయం :        

    ఓడ నిర్మాణం పూర్తికాగానే , దేవుడు ప్రతి జాతికి చెందిన జంతువును నోవహు దగ్గరకు పంపించాడు .జతలు జతలుగా అవి ఓడలో తమకోసం సిద్ధం చేసిన గదుల్లోకి ప్రవేశించాయి జంతువులన్నీ ఓడలోకి ప్రవేశించాక దేవుడే స్వయముగా ఆ ఓడకున్న పెద్ద తలుపును మూసేసాడు .
         తర్వాత వర్షం మొదలయింది .మొదట  నీళ్లు ,వీధుల్ని పొలాలని కప్పేశాయి. ప్రపంచమంతా వర్షం కురవ సాగింది. అప్పుడు ఇళ్ళు పట్టణాలు జలమయమయ్యాయి . మరింత వర్షం కురిసింది. అంతటితో ఓడ నెమ్మదిగా , భద్రంగా నీళ్లపై తేలడం మొదలుపెట్టింది. ఆ పెద్ద ఓడ గాలి వీచే దిశగా కదులుతూ ప్రపంచమంతటిని కప్పేసిన జల రాశిపై తేలియాడుతోంది అయితే  లోపల ఓడ పొడిగా , బధ్రంగా ఉండేలా ఎలా కట్టాలో దేవుడు నోవహును చెప్పాడు గనుక ఓడలో ఉన్నవాళ్లంతా క్షేమముగా ఉన్నారు. నలభై పగళ్లు నలభై రాత్రుల వరకు వర్షం కురుస్తూనే ఉంది .  పర్వత శిఖరాల సైతం ఓడను మునిగిపోయాయి . ఇప్పుడు భూమ్మీద ఇంకా  బ్రతికి ఉన్న మనుషులు ఒక్క నోవహు , అతని కుటుంబము తప్ప ఇంకెవరు లేరు అయితే దేవుడు నోవహును , అతని కుటుంబాన్ని, ఓడలో ఉన్న జంతువులన్నీటినీ మర్చిపోలేదు .
                                                                                                                      ఆదికాండం  6-2

                                                                      -నవీన్ కుమార్  యెలుమర్తి -

THE FALL OF MAN ( మనిషి యొక్క పతనం )

                                            


              దేవుడు సమస్తాన్ని ఎంతో పరిపూర్ణముగా సృష్టించిన ఏదేను వనములో ఆదాము హవ్వలు అనుభవించిన ఆనందాన్ని ఏదీ నాశనం చేయలేదేమో అన్నట్లు కనిపించింది. అయితే ఒక రోజు హవ్వ తెలివి తేటలనిచ్చే చెట్టుకు దగ్గరలో నిలబడి, తాను తినలేని పండు వైపు చూస్తూ ఉన్న సమయంలో , సాతాను అనే ప్రాణి యెక్క స్వరం ఆమె విన్నది.
         సాతాను ఏ జంతువులా గా అయినా తనను తాను మార్చుకోగలడు గనుక ఇప్పుడు పాము ఆకారంలో కనిపించి హవ్వతో ఇలా అన్నాడు."ఈ చెట్టు ఫలాలు తినొద్దని దేవుడు మీతో నిజంగానే చెప్పాడా? దేవుడు నిజంగా ఆ ఉద్దేశంతోనే మీకు చెప్పాడని మీరనుకుంటున్నారా?"
          "అవును, మేము ఈ పండు తినొద్దని దేవుడు కచ్చితంగా చెప్పాడు " అంది హవ్వ. "కానీ మీరు ఈ పండును కాస్త కొరుక్కుని తినకూడదా?  నేను చెప్తున్నాను కదా, అవి నిజంగా బలే రుచిగా  ఉంటాయి," అంటూ శోధించాడు సాతాను.  ఇక హవ్వ ఆ శోధనకు తట్టుకోలేక పోయింది. ఆమె చెట్టు దగ్గరకు వెళ్లి పండును తీసుకుని , రుచి చూచి , దాన్ని తినేసింది.

ఆమె దానిలో కొంత ఆదామునకు ఇచ్చింది , అతడు కుడా తిన్నాడు . అయితే వాళ్ళు ఆ పండును తిన్న వెంటనే , వాళ్లకి ఏదోలా అనిపించింది .హఠాత్తుగా సమస్తం వేరుగా కనిపించింది వాళ్ళు చేసిన ఆ పనికి వాళ్ళు సిగ్గు పడ్డారు అంతే కాదు, వాళ్ళు ఒంటి మీద బట్టలు లేవాని  గ్రహించి సిగ్గుతో దాక్కున్నారు.
 
        సాయంకాలం దేవుడు ఆ తోటలో నడుచుకుంటూ వచ్చినప్పుడు , ఆదాము హవ్వలు బయటకొచ్చి ఆయన్ని కలిసే ధైర్యం  చేయలేకపోయారు . అందువల్ల దేవుడు పిలుస్తున్నాడు ,"ఆదామా , నువ్వెక్కడున్నావ్ ?" అని .                  " ఇదిగో   నేను ఇక్కడ  ఉన్నాను" అన్నాడు ఆదాము.  అతని స్వరం పూర్తిగా మారిపోయినట్లు దేవునికి వినబడింది.
అప్పుడు దేవుడన్నాడు,"అయితే నేను తినొద్దని నిషేధించిన పండు మీరు తిన్నారా ?"
"వాస్తవానికి, ఇదంతా నీవు నాకిచ్చిన స్త్రీ, హవ్వ చేసిన పని. ఆమే నా చేత ఆ పండు తినిపించింది"అన్నాడు ఆదాము. హవ్వేమో "కాదు ఆ దుర్మార్గపు పామే నన్ను శోధించి ఆ చెట్టు పండు తినేలా చేసింది. "                                                    అయితే దేవునికి కోపం వచ్చింది . "ఈ పండు తినొద్దని నేను మీకు పదే పదే చెప్పాను అంటే ఇక మీదట ఏ మాత్రం మీరు తోటలో ఉండటానికి వీలు లేదు. ఇప్పుడు నేను మిమల్ని ఈ ఏదేను తోట  నుండి శాశ్వతంగా బయటకి తరిమేయాలి, ఇప్పటి నుంచి భూమి మీద మీఅంతట మీరే బ్రతకాలి. పైగా ఏదేనులో  మీరు నాతో ముఖ ముఖీగా మాట్లాడినట్లు ఇక మీదట నాతో మాట్లాడ లేరు."
           ఆదాము హవ్వలు ఆ తోటను విడిచి వ్వెళ్లాల్సి వచ్చిన ఆ రోజు ఎంతో విచారకరమైన రోజు. తోటలోనికి మరల ఎవరు ఎప్పటికి ప్రవేసించకుండ ఏదేను తోట ద్వారాన్ని అగ్ని ఖడ్గం ధరించిన ఒక దేవదూత కాపలాకాస్తున్నాడు. ఏదేను తోటలో దేవునితో ఉన్న పరదైసును ఆదాము హవ్వలు పోగొట్టుకున్నారు.
అయితే దేవుడు ఆదాము హవ్వలను ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాడు. దేవుడు వాళ్లని మరువలేదు.
                                                                                                                                            ఆదికాండము 3

                                                                          - నవీన్ కుమార్  యెలుమర్తి 

Friday, 14 September 2018

ADAM &EVE (ఆదాము -హవ్వ)

ఆదాము -హవ్వ :

                         
                  6వ రోజు దేవుడు ''నేను మనుషులను సృష్టించాలని అనుకుంటున్నాను వాళ్లకి మనసాక్షి ఉంటుంది గనుక వారు అలోచించి,తెలుసుకొని  నన్ను ప్రేమించగలరు, ఒకరినొకరు ప్రేమించుకోగలరు. నేను చేసిన వాటన్నిటి మీద వాళ్ళని యజమానులుగా చేస్తాను అప్పుడు నా సృష్టిని వాళ్ళు జాగ్రత్తగా చూచుకుంటారు అనుకున్నాడు . నేల మీద నుంచి దేవుడు మట్టిని తీసుకొని, తొలి మానవుడైన ఆదామును రూపించాడు. 
               దేవుడు ఆదామునకు తన ఆకారాన్ని ఇచ్చాడు అతని నాసికా రంధ్రాలలలోనికి జీవవాయువుని ఊదగా ఆదామునకు ప్రాణం వచ్చింది ,అపుడు ఆదాము కూడా తక్కిన ప్రాణుల వలె ఊపిరి పీల్చుకోవటం ఆరంభించాడు ఆదాము కళ్ళు తెరచి చూడగానే తానొక అందమైన తోటలో ఉన్నట్లు కనుగొన్నాడు అది దేవుడు అతని కోసం సృష్టిచిన ఏదేను తోట . 
              ఏదేను తోటలో తన చుట్టూ చేరిన అన్నిరకాల జంతువులను దేవుడు చూచి ఆదాము ఎంతో ఉత్తేజితుడయ్యాడు. అందు చేత వాటిలో ఏది ఏమిటో తెలియటం కోసం ఆ జంతువులన్నిటికి పేర్లు పెట్టాలనుకున్నాడు . 
            అయితే ఆదాము ఏంతో ఒంటరిగా ఉన్నట్లు అనిపించింది ఎందుకంటే జీవము కలిగిన ప్రాణులన్నిటిలో అతని లాగా ఉన్నదేది అతనికి కనబడలేదు భూమ్మీద ఆదాము  ఒక్కడే మనిషి . ఆదాము ఒంటరిగా ఉండటం మంచిది కాదని దేవుడు చూచి  ''ఆదాము ఇక ఏ మాత్రం ఒంటరిగా ఉండకుండా అతనికోసం ఒక సహచరిని సృష్టిస్తాను" అనుకున్నాడు . కాబట్టి ,ఆదాము గాఢనిద్ర  లోకి  జారుకున్నాడు.  దేవుడు అతని  కోసం హవ్వ అనే ఒక సహచరిని సృష్టించాడు. ఆదాము తన గాఢనిద్ర  నుండి మేల్కొని కళ్ళు తెరిచినప్పుడు అతడు ఈ కొత్త వ్యక్తిని చూసాడు . "ఈమె నరులలో నుండి తీయబడింది గనుక నారి అనబడును" అన్నాడు . 
            దేవుడు ఆదాము హవ్వలను దీవించి , ఆయన సృష్టించిన దానంతటిని అనుభవిస్తూ ఆనందంగా జీవించమని చెప్పాడు. "మీరు పిల్లల్ని కనండి నేను సృష్టించిన సమస్తాన్ని జాగ్రత్తగా చూచుకోవటంలో మీకు సహాయం చేయమని చెప్పండి . భూమ్మీద ప్రతి మూలన జీవంతో కళకళలాడాలి, ప్రతిదీ అభివృధిచెంది ,  వికసించి , ఎదగాలి . ఈ తోటలో నేను మీకోసం చేసిన వాటిలో మీకు కనిపించిన వన్నీ మీరు తినవచ్చు .అయితే మంచి చెడ్డల తెలివినిచ్చే  చెట్లఫలాలు మాత్రం తినకండి . తిన్నారంటే మీరు చచ్చిపోతారు"  అని చెప్పాడు దేవుడు . 
           అప్పుడే ఆరంభమైన కాలంలోని ఈ మొదటి 6రోజుల్లో దేవుడు అన్నిటిని సృష్టించాడు ."ఇప్పుడు సమస్తం పరిపూర్ణంగా ఉంది . ఇది చాలా చాలా బావుంది" అన్నాడాయన                                                    



                                                                                                                                        ఆదికాండము 2
                                                                                     
                                                                                       - NAVEEN KUMAR YELUMARTHI  -