ఇశ్రాయేలు ప్రజలు ఇప్పుడు ఒక పెద్ద ఎడారి ప్రాంతంలో ఒక చోటనుంచి మరో చోటకి తిరుగుతూ వున్నారు. ఎడారిలో ఉండమంటే చాలా వేడిగా, కఠినంగా ఉంటుంది గనుక ప్రజలు తినడానికి చాలినంత ఆహారం లేదని మోషేకు ఫిర్యాదు చేయటం మొదలు పెట్టారు. గనుక దేవుడు తన ప్రజలకు ఒక ప్రత్యేకమైన విధానంలో ఆహారం పంపాడు. ప్రతి రోజు ఉదయాన్నే వాళ్ళు నిద్రలేవగానే, నేలమీద మన్నా అనే తియ్యటి రొట్టె ముక్కలు పడిఉండేవి. తర్వాత మధ్యాహ్నం దేవుడు పూరేడు పక్షులను పాలెం లోనికి పంపేశాడు. వాటిని ఇశ్రాయేలీయులు సులువుగా పట్టుకొని తినేవాళ్లు.
వాళ్ళు వెళ్లిన ప్రతిచోట దేవుడు ప్రజల్ని కాపాడుతూ, ప్రతి రోజు ప్రొద్దుటే ఆకాశం నుంచి తగినంత మన్నా పంపేవాడు . అయితే ఒక రోజు వాళ్లంతా ఒక చోటకి చేరుకున్నారు. కానీ అక్కడ త్రాగడానికి చుక్క నీరు లేదు. ప్రజలు మళ్ళి మోషేకి ఫిర్యాదు చేయసాగారు, "త్రాగడానికి మాకు నీళ్లివ్వు" అన్నారు.
మోషే దేవునికి ప్రార్ధన చేసాడు. అప్పుడు దేవుడు అతనికి ఒక పెద్ద రాయిని చూపించి, "నీ కర్రతో ఆ రాయిని కొట్టు" అని చెప్పాడు మోషే దేవుడు చెప్పినట్లే చేశాడు, వెంటనే రాయిలో నుంచి నీళ్లు ఒక్క ఉదుటున ప్రవహించాయి. ఇప్పుడు ప్రజలు వాళ్లకి కావాల్సినంత నీరు త్రాగారు. మరొకసారి దేవుడు తన ప్రజలకు సహాయం చేసాడు.
నిర్గమకాండము 16-17
-నవీన్ కుమార్ యెలుమర్తి -
వాళ్ళు వెళ్లిన ప్రతిచోట దేవుడు ప్రజల్ని కాపాడుతూ, ప్రతి రోజు ప్రొద్దుటే ఆకాశం నుంచి తగినంత మన్నా పంపేవాడు . అయితే ఒక రోజు వాళ్లంతా ఒక చోటకి చేరుకున్నారు. కానీ అక్కడ త్రాగడానికి చుక్క నీరు లేదు. ప్రజలు మళ్ళి మోషేకి ఫిర్యాదు చేయసాగారు, "త్రాగడానికి మాకు నీళ్లివ్వు" అన్నారు.
మోషే దేవునికి ప్రార్ధన చేసాడు. అప్పుడు దేవుడు అతనికి ఒక పెద్ద రాయిని చూపించి, "నీ కర్రతో ఆ రాయిని కొట్టు" అని చెప్పాడు మోషే దేవుడు చెప్పినట్లే చేశాడు, వెంటనే రాయిలో నుంచి నీళ్లు ఒక్క ఉదుటున ప్రవహించాయి. ఇప్పుడు ప్రజలు వాళ్లకి కావాల్సినంత నీరు త్రాగారు. మరొకసారి దేవుడు తన ప్రజలకు సహాయం చేసాడు.
నిర్గమకాండము 16-17
-నవీన్ కుమార్ యెలుమర్తి -