దేవుడు సమస్తాన్ని ఎంతో పరిపూర్ణముగా సృష్టించిన ఏదేను వనములో ఆదాము హవ్వలు అనుభవించిన ఆనందాన్ని ఏదీ నాశనం చేయలేదేమో అన్నట్లు కనిపించింది. అయితే ఒక రోజు హవ్వ తెలివి తేటలనిచ్చే చెట్టుకు దగ్గరలో నిలబడి, తాను తినలేని పండు వైపు చూస్తూ ఉన్న సమయంలో , సాతాను అనే ప్రాణి యెక్క స్వరం ఆమె విన్నది.
సాతాను ఏ జంతువులా గా అయినా తనను తాను మార్చుకోగలడు గనుక ఇప్పుడు పాము ఆకారంలో కనిపించి హవ్వతో ఇలా అన్నాడు."ఈ చెట్టు ఫలాలు తినొద్దని దేవుడు మీతో నిజంగానే చెప్పాడా? దేవుడు నిజంగా ఆ ఉద్దేశంతోనే మీకు చెప్పాడని మీరనుకుంటున్నారా?"
"అవును, మేము ఈ పండు తినొద్దని దేవుడు కచ్చితంగా చెప్పాడు " అంది హవ్వ. "కానీ మీరు ఈ పండును కాస్త కొరుక్కుని తినకూడదా? నేను చెప్తున్నాను కదా, అవి నిజంగా బలే రుచిగా ఉంటాయి," అంటూ శోధించాడు సాతాను. ఇక హవ్వ ఆ శోధనకు తట్టుకోలేక పోయింది. ఆమె చెట్టు దగ్గరకు వెళ్లి పండును తీసుకుని , రుచి చూచి , దాన్ని తినేసింది.
ఆమె దానిలో కొంత ఆదామునకు ఇచ్చింది , అతడు కుడా తిన్నాడు . అయితే వాళ్ళు ఆ పండును తిన్న వెంటనే , వాళ్లకి ఏదోలా అనిపించింది .హఠాత్తుగా సమస్తం వేరుగా కనిపించింది వాళ్ళు చేసిన ఆ పనికి వాళ్ళు సిగ్గు పడ్డారు అంతే కాదు, వాళ్ళు ఒంటి మీద బట్టలు లేవాని గ్రహించి సిగ్గుతో దాక్కున్నారు.
సాయంకాలం దేవుడు ఆ తోటలో నడుచుకుంటూ వచ్చినప్పుడు , ఆదాము హవ్వలు బయటకొచ్చి ఆయన్ని కలిసే ధైర్యం చేయలేకపోయారు . అందువల్ల దేవుడు పిలుస్తున్నాడు ,"ఆదామా , నువ్వెక్కడున్నావ్ ?" అని . " ఇదిగో నేను ఇక్కడ ఉన్నాను" అన్నాడు ఆదాము. అతని స్వరం పూర్తిగా మారిపోయినట్లు దేవునికి వినబడింది.
అప్పుడు దేవుడన్నాడు,"అయితే నేను తినొద్దని నిషేధించిన పండు మీరు తిన్నారా ?"
"వాస్తవానికి, ఇదంతా నీవు నాకిచ్చిన స్త్రీ, హవ్వ చేసిన పని. ఆమే నా చేత ఆ పండు తినిపించింది"అన్నాడు ఆదాము. హవ్వేమో "కాదు ఆ దుర్మార్గపు పామే నన్ను శోధించి ఆ చెట్టు పండు తినేలా చేసింది. " అయితే దేవునికి కోపం వచ్చింది . "ఈ పండు తినొద్దని నేను మీకు పదే పదే చెప్పాను అంటే ఇక మీదట ఏ మాత్రం మీరు తోటలో ఉండటానికి వీలు లేదు. ఇప్పుడు నేను మిమల్ని ఈ ఏదేను తోట నుండి శాశ్వతంగా బయటకి తరిమేయాలి, ఇప్పటి నుంచి భూమి మీద మీఅంతట మీరే బ్రతకాలి. పైగా ఏదేనులో మీరు నాతో ముఖ ముఖీగా మాట్లాడినట్లు ఇక మీదట నాతో మాట్లాడ లేరు."
ఆదాము హవ్వలు ఆ తోటను విడిచి వ్వెళ్లాల్సి వచ్చిన ఆ రోజు ఎంతో విచారకరమైన రోజు. తోటలోనికి మరల ఎవరు ఎప్పటికి ప్రవేసించకుండ ఏదేను తోట ద్వారాన్ని అగ్ని ఖడ్గం ధరించిన ఒక దేవదూత కాపలాకాస్తున్నాడు. ఏదేను తోటలో దేవునితో ఉన్న పరదైసును ఆదాము హవ్వలు పోగొట్టుకున్నారు.
అయితే దేవుడు ఆదాము హవ్వలను ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాడు. దేవుడు వాళ్లని మరువలేదు.
ఆదికాండము 3
- నవీన్ కుమార్ యెలుమర్తి -
సాతాను ఏ జంతువులా గా అయినా తనను తాను మార్చుకోగలడు గనుక ఇప్పుడు పాము ఆకారంలో కనిపించి హవ్వతో ఇలా అన్నాడు."ఈ చెట్టు ఫలాలు తినొద్దని దేవుడు మీతో నిజంగానే చెప్పాడా? దేవుడు నిజంగా ఆ ఉద్దేశంతోనే మీకు చెప్పాడని మీరనుకుంటున్నారా?"

ఆమె దానిలో కొంత ఆదామునకు ఇచ్చింది , అతడు కుడా తిన్నాడు . అయితే వాళ్ళు ఆ పండును తిన్న వెంటనే , వాళ్లకి ఏదోలా అనిపించింది .హఠాత్తుగా సమస్తం వేరుగా కనిపించింది వాళ్ళు చేసిన ఆ పనికి వాళ్ళు సిగ్గు పడ్డారు అంతే కాదు, వాళ్ళు ఒంటి మీద బట్టలు లేవాని గ్రహించి సిగ్గుతో దాక్కున్నారు.
సాయంకాలం దేవుడు ఆ తోటలో నడుచుకుంటూ వచ్చినప్పుడు , ఆదాము హవ్వలు బయటకొచ్చి ఆయన్ని కలిసే ధైర్యం చేయలేకపోయారు . అందువల్ల దేవుడు పిలుస్తున్నాడు ,"ఆదామా , నువ్వెక్కడున్నావ్ ?" అని . " ఇదిగో నేను ఇక్కడ ఉన్నాను" అన్నాడు ఆదాము. అతని స్వరం పూర్తిగా మారిపోయినట్లు దేవునికి వినబడింది.
అప్పుడు దేవుడన్నాడు,"అయితే నేను తినొద్దని నిషేధించిన పండు మీరు తిన్నారా ?"
"వాస్తవానికి, ఇదంతా నీవు నాకిచ్చిన స్త్రీ, హవ్వ చేసిన పని. ఆమే నా చేత ఆ పండు తినిపించింది"అన్నాడు ఆదాము. హవ్వేమో "కాదు ఆ దుర్మార్గపు పామే నన్ను శోధించి ఆ చెట్టు పండు తినేలా చేసింది. " అయితే దేవునికి కోపం వచ్చింది . "ఈ పండు తినొద్దని నేను మీకు పదే పదే చెప్పాను అంటే ఇక మీదట ఏ మాత్రం మీరు తోటలో ఉండటానికి వీలు లేదు. ఇప్పుడు నేను మిమల్ని ఈ ఏదేను తోట నుండి శాశ్వతంగా బయటకి తరిమేయాలి, ఇప్పటి నుంచి భూమి మీద మీఅంతట మీరే బ్రతకాలి. పైగా ఏదేనులో మీరు నాతో ముఖ ముఖీగా మాట్లాడినట్లు ఇక మీదట నాతో మాట్లాడ లేరు."
ఆదాము హవ్వలు ఆ తోటను విడిచి వ్వెళ్లాల్సి వచ్చిన ఆ రోజు ఎంతో విచారకరమైన రోజు. తోటలోనికి మరల ఎవరు ఎప్పటికి ప్రవేసించకుండ ఏదేను తోట ద్వారాన్ని అగ్ని ఖడ్గం ధరించిన ఒక దేవదూత కాపలాకాస్తున్నాడు. ఏదేను తోటలో దేవునితో ఉన్న పరదైసును ఆదాము హవ్వలు పోగొట్టుకున్నారు.
అయితే దేవుడు ఆదాము హవ్వలను ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాడు. దేవుడు వాళ్లని మరువలేదు.
ఆదికాండము 3
- నవీన్ కుమార్ యెలుమర్తి -
No comments:
Post a Comment