యేసేపు అతని కుటుంబము చనిపోయాక కుడా. ఇశ్రాయేలులుగా పిలవబడిన అతని సంతానం ఐగుప్తులోనే ఉండిపోయారు .
అయితే యేసేపు చనిపోయాక ఇశ్రాయేలీయలకు పరిస్థితులు అనుకూలంగా లేవు. ఫరోలనబడే కొత్త రాజులకు ఇశ్రాయేలీయులు నచ్చ లేదు గనుక వాళ్ళని ఐగుప్తులో బానిసలుగా చేశారు. వాళ్ళు చాలా కష్టపడి ఎక్కువసేపు పనిచేయవలసి వచ్చేది. కానీ తినడానికి సరిపోయినంత ఆహారం ఉండేది కాదు.
ఇశ్రాయేలీయలకు ఏంతో మంది పిల్లలు పుట్టి వాళ్లంతా ఐగుప్తువాళ్ళకంటే ఎక్కువై. తమ రాజ్జాన్ని స్వాధీనం చేసుకోడానికి ప్రయత్నిస్తారేమోనని దుర్నర్గుడైన ఫరో భయపడ్డాడు. అప్పుడతడు భయంకరమైన క్రూరమైన నిర్ణయం తీసుకుని ఒక శాసనం చేశాడు. ఇశ్రాయేలుయలకు చెందిన మగ పిల్లలందచేసింది రినీ చంపేయాలన్నదే ఆ శాసనం. ఇశ్రాయేలీయులు ఫరోకి భయపడి సహాయంకోసం దేవునికి ప్రార్ధన చేశారు.
ఒక ఇశ్రాయేలు స్త్రీ ఓ మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఫరో సైనికులకు కనబడకుండ ఆ బిడ్డను కాపాడలనుకొని, పడవలాగా ఒక తేలే బుట్టను తయారు చేసింది తర్వాత తన బిడ్డని ఆ బుట్టలో పెట్టి దాన్ని నైలు నదిలోకి పంపింది. ఏం చెయ్యాలో ఆమెకు తెలియలేదు. ఇక తన బిడ్డను కాపాడే బాధ్యత దేవునిదే.
ఆ చిన్నవాడి అక్క మిర్యాము దాక్కుని, నదిలో తేలుతూ వెళుతున్న బుట్టను గమనిస్తూ ఉంది. ఆ బుట్ట నీళ్లపై తేలకుండా ఎక్కడ మునిగిపోతుందోనని ఆ అమ్మాయి ఒకటే ఆందోళన చెందుతోంది. అయితే అప్పుడే ఫరో కుమార్తె అయిన యువరాణి ఆ బుట్టను చూచి, అందులో అందులో బిడ్డ ఉన్నట్లు కనుగొన్నది. ఆ పసివాణ్ణి చూచి, ఆమె ఇష్టపడి, "నేను ఈ బిడ్డను తీసుకుంటాను. వీడు నా కుమారుడవుతాడు" అని చెప్పింది.
కానీ అంత చిన్న బిడ్డకు ఆహారం ఎలా ఇస్తుంది ? ఆవిషయమే తన చుట్టూ ఉన్న సేవకురాళ్లతో ఆమె చర్చిస్తుంది.. మిర్యాము దాక్కుని ఉన్న చోటనుంచే ఈ సంబాషణ విని పరిగెత్తుకుంటూ వెళ్లి యువరాణితో ఈ మాట చెప్పింది. "ఈ బిడ్డకు ఆహారం ఇవ్వగల ఒక ఆమె నాకు తెలుసు" వెంటనే యువరాణి ఆమె సహాయానికి కృతజ్నతలు చెప్పి, ఆ బిడ్డని తన అక్కకే తిరిగి ఇచ్చేసింది. తన తమ్ముణ్ణి తీసుకుని ఇంటికి వెళ్తున్నందుకు మిర్యాము ఎంతో సంతోషించింది, బిడ్డ చిన్నవాడిగా ఉన్నంత కాలం తల్లే జాగ్రత్తగా పోషించింది. తన పసివాణ్ణి దేవుడు అంత క్షేమముగా కాపాడినందుకు తల్లి దేవునికి వందనాలు చెప్పింది.
నిర్గమకాండము 1-2
-నవీన్ కుమార్ యెలుమర్తి -
No comments:
Post a Comment