ఊరు అనే నగరంలో అబ్రాహాము అనే చాలా మంచి వ్యక్తి ఉండేవాడు అతడు ప్రపంచములోనే అత్యంత ధనికుడు. ఎంత ధనవంతుడంటే, అతనికున్న పశువులను గొర్రెలను, ఒంటెలను కాయడానికే కొన్ని వందల మంది పనివాళ్ళు అతనికి అవసరమయ్యేవాళ్ళు . దేవుడు అబ్రాహామును ఉన్నత స్థితిలో ఉంచాడు.
ఒక రోజు అబ్రాహాముతో దేవుడు ఇలా అన్నాడు, "నీవూ నీ భార్య శారయి కానను అనే మరొక దేశానికి వెళ్ళాలి. నీకోసం నీ కుటుంబము కోసం నాకొక ప్రత్యేకమైన యెచన ఉంది ." వెంటనే అబ్రాహాము శారయి దేవుని మాటకు లోబడి, వారి కొత్త దేశానికి వెళ్లే ఒక సుదీర్ఘ ప్రయాణం ఆరంభించారు . వాళ్ళు కున్న పశువులను వస్తువులన్నిటినీ భద్రంగా చూచుకోవడం కోసం వాళ్ళ పనివాళ్ళందరూ కుడా బయలుదేర వలసి వచ్చింది.
ఒక రోజు అబ్రాహాముతో దేవుడు ఇలా అన్నాడు, "నీవూ నీ భార్య శారయి కానను అనే మరొక దేశానికి వెళ్ళాలి. నీకోసం నీ కుటుంబము కోసం నాకొక ప్రత్యేకమైన యెచన ఉంది ." వెంటనే అబ్రాహాము శారయి దేవుని మాటకు లోబడి, వారి కొత్త దేశానికి వెళ్లే ఒక సుదీర్ఘ ప్రయాణం ఆరంభించారు . వాళ్ళు కున్న పశువులను వస్తువులన్నిటినీ భద్రంగా చూచుకోవడం కోసం వాళ్ళ పనివాళ్ళందరూ కుడా బయలుదేర వలసి వచ్చింది.
వాళ్ళు అనేక సంవత్సరాలు ప్రయాణం చేసి అనేక ప్రాంతాలలో స్థిర పడుతూ, చివరికి దేవుడు అబ్రాహాముకు ఇస్తానని వాగ్దానం చేసిన కానను దేశానికి చేరుకుంటారు. హెబ్రోను అనే ప్రాంతంలో ఉన్న పెద్ద చెట్లకు దగ్గరలో వాళ్ళు తమ గుడారాలు వేసుకుంటారు.
ఆదికాండము 12-23
-నవీన్ కుమార్ యెలుమర్తి -
-నవీన్ కుమార్ యెలుమర్తి -
No comments:
Post a Comment