ఆ అబ్బాయి కొంచెం ఎదిగాక, అతన్ని యువరాణి ఉండే రాజా భవనానినికి తీసుకొచ్చారు. అక్కడే అతడు పెద్దవాడయ్యాడు, యువరాణి ఆ బిడ్డకు మోషే అని పేరు పెట్టింది. మోసే పెద్దవాడయ్యాక, అతడు ఇశ్రాయేలుయుడు అని తెలుసుకున్నాడు తన వాళ్ళు ఐగుప్తులో బానిసలుగా ఉన్న తీరు, వాళ్ళని ఎంత దారుణంగా చూస్తున్న విధానం చూచిన మోషేకి ఎంతో కోపం వచ్చింది. కాబట్టి తన ప్రజల్లో కొంతమందికి సహాయం చెయ్యాలని ప్రయత్నించాడు. ఈ విషయం ఫరోకు తెలిసినప్పుడు అతని విపరీతంగా కోపపడ్డాడు. అందువలన మోషే తన ప్రాణాలు కాపాడుకోవటం కోసం ఐగుప్తు విడిచి పారిపోవాల్సి వచ్చింది. అతడు వేరొక దేశం వెళ్ళి, గొర్రెలు కాచుకుంటూ నలభై ఏళ్ళు అక్కడే ఉన్నాడు.
ఒక రోజు మోషే శేష జీవితమంతటిని మార్చివేసి అతి ప్రాముఖ్యమైన సంఘటన ఒకటి జరిగింది. అతడు తన గొర్రెలను కాచుకుంటూ ఒక కొండవైపు తేరిచూస్తున్న సమయంలో అకస్మాత్తుగా అతనికి పర్వతం మీద ఒక వింతైన పొద కనబడుతుంది ఆ పొద మంటల్లో చుక్కుకుంది కానీ కాలిపోవడంలేదు.
మోషే పర్వతం మీదకి ఎక్కిపోయి, పొదవైపు నడిచాడు. సరిగ్గా అదే సమయంలో, మండుతున్న ఆ పొదలోనుంచి దేవుడు అతన్ని పిలిచాడు. ఆ మంటల్లోనుంచి వస్తున్నట్లు అనిపించిన దేవుని స్వరం "దగ్గరకు రావద్దు. నీవు పరిశుద్ధమైన నేల మీద నిలబడ్డావు గనుక నీ చెప్పులు తీసేయ్" అని చెప్పినట్లు వినబడింది. మోషే చాలా భయపడ్డాడు.
దేవుడు మోషేతో "భయపడకు, నేను నీకు తోడుగా ఉన్నాను. నా ప్రజలైన ఇశ్రాయేలీయులు ఐగుప్తులో బాధపడటం నేను చూశాను. నేను వాళ్ళని మరువలేదు. ఇశ్రాయేలీయులు నా ప్రజలని,వాళ్ళు ఐగుప్తు విడిచివెళ్లాలని ఫరోకు చెప్పా. మోషే, వాళ్ళని నీవు ఐగుప్తులో నుంచి బయటకునడిపించాలి" అన్నాడు అయితే మరల ఐగుప్తు వెళ్ళడానికి మోషే భయపడ్డాడు .
అప్పుడు మోషే దేవునితో అన్నాడు, "ఈ మాటలు ఫరోతో చెప్పడానికి నేనేపాటివాడను? నేను కేవలం ఓ గొర్రెల కాపరిని, నేను ఇశ్రాయేలీలుయులను నడిపించలేను." యితే దేవుడు "నేను నిన్ను క్షేమముగా కాపాడతాను. నీ చేతి కర్రను తీసుకుని ఐగుప్తులో అద్భుతాలు జరిగిచడానికి దాన్ని ఉపయోగించు" అని చెప్పాడు. నేను అబ్రాహాముకు వాగ్దానం చేసిన కానను దేశంలోకి నీవు వాళ్ళని నడిపిస్తావు. ఇప్పుడు వెళ్ళు,నేను నీకు తోడుగా ఉంటాను" అని చెప్పాడు.మోషేకి ఇంకా భయంగానే ఉంది కానీ , దేవునికి విధేయుడయ్యి వెళ్ళాడు.
నిర్గమకాండం 3
-నవీన్ కుమార్ యెలుమర్తి -
No comments:
Post a Comment