ఆదాము -హవ్వ :
6వ రోజు దేవుడు ''నేను మనుషులను సృష్టించాలని అనుకుంటున్నాను వాళ్లకి మనసాక్షి ఉంటుంది గనుక వారు అలోచించి,తెలుసుకొని నన్ను ప్రేమించగలరు, ఒకరినొకరు ప్రేమించుకోగలరు. నేను చేసిన వాటన్నిటి మీద వాళ్ళని యజమానులుగా చేస్తాను అప్పుడు నా సృష్టిని వాళ్ళు జాగ్రత్తగా చూచుకుంటారు అనుకున్నాడు . నేల మీద నుంచి దేవుడు మట్టిని తీసుకొని, తొలి మానవుడైన ఆదామును రూపించాడు.
దేవుడు ఆదామునకు తన ఆకారాన్ని ఇచ్చాడు అతని నాసికా రంధ్రాలలలోనికి జీవవాయువుని ఊదగా ఆదామునకు ప్రాణం వచ్చింది ,అపుడు ఆదాము కూడా తక్కిన ప్రాణుల వలె ఊపిరి పీల్చుకోవటం ఆరంభించాడు ఆదాము కళ్ళు తెరచి చూడగానే తానొక అందమైన తోటలో ఉన్నట్లు కనుగొన్నాడు అది దేవుడు అతని కోసం సృష్టిచిన ఏదేను తోట .
ఏదేను తోటలో తన చుట్టూ చేరిన అన్నిరకాల జంతువులను దేవుడు చూచి ఆదాము ఎంతో ఉత్తేజితుడయ్యాడు. అందు చేత వాటిలో ఏది ఏమిటో తెలియటం కోసం ఆ జంతువులన్నిటికి పేర్లు పెట్టాలనుకున్నాడు .
అయితే ఆదాము ఏంతో ఒంటరిగా ఉన్నట్లు అనిపించింది ఎందుకంటే జీవము కలిగిన ప్రాణులన్నిటిలో అతని లాగా ఉన్నదేది అతనికి కనబడలేదు భూమ్మీద ఆదాము ఒక్కడే మనిషి . ఆదాము ఒంటరిగా ఉండటం మంచిది కాదని దేవుడు చూచి ''ఆదాము ఇక ఏ మాత్రం ఒంటరిగా ఉండకుండా అతనికోసం ఒక సహచరిని సృష్టిస్తాను" అనుకున్నాడు . కాబట్టి ,ఆదాము గాఢనిద్ర లోకి జారుకున్నాడు. దేవుడు అతని కోసం హవ్వ అనే ఒక సహచరిని సృష్టించాడు. ఆదాము తన గాఢనిద్ర నుండి మేల్కొని కళ్ళు తెరిచినప్పుడు అతడు ఈ కొత్త వ్యక్తిని చూసాడు . "ఈమె నరులలో నుండి తీయబడింది గనుక నారి అనబడును" అన్నాడు .
దేవుడు ఆదాము హవ్వలను దీవించి , ఆయన సృష్టించిన దానంతటిని అనుభవిస్తూ ఆనందంగా జీవించమని చెప్పాడు. "మీరు పిల్లల్ని కనండి నేను సృష్టించిన సమస్తాన్ని జాగ్రత్తగా చూచుకోవటంలో మీకు సహాయం చేయమని చెప్పండి . భూమ్మీద ప్రతి మూలన జీవంతో కళకళలాడాలి, ప్రతిదీ అభివృధిచెంది , వికసించి , ఎదగాలి . ఈ తోటలో నేను మీకోసం చేసిన వాటిలో మీకు కనిపించిన వన్నీ మీరు తినవచ్చు .అయితే మంచి చెడ్డల తెలివినిచ్చే చెట్లఫలాలు మాత్రం తినకండి . తిన్నారంటే మీరు చచ్చిపోతారు" అని చెప్పాడు దేవుడు .
అప్పుడే ఆరంభమైన కాలంలోని ఈ మొదటి 6రోజుల్లో దేవుడు అన్నిటిని సృష్టించాడు ."ఇప్పుడు సమస్తం పరిపూర్ణంగా ఉంది . ఇది చాలా చాలా బావుంది" అన్నాడాయన
ఆదికాండము 2
- NAVEEN KUMAR YELUMARTHI -
No comments:
Post a Comment