జలప్రళయం తర్వాత మళ్ళి ప్రపంచమంతా మనుషులతో నిండిపోయింది ప్రతి ఒక్కరు ఒకే భాషా మాట్లాడుతుండేవారు గనుక ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలంతా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ తెలికిగా అర్ధం చేసుకోగలుగుతున్నారు. ఒక రోజు చాలా మంది ప్రజలు ఒక పట్టణంలో చేరి, ఇలా అనుకున్నారు "మనం ఆకాశాన్నంటే ఒక పొడవైన గోపురం కట్టుదాం రండి, అప్పుడు భూమ్మీద నివసించే వాళ్ళందరి కంటే మనమే గొప్ప, అత్యంత ఘనమైన ప్రజలమని భవిష్యత్తులో అందరూ మనల్ని
గుర్తుపెట్టుకుంటారు ."
అయితే వాళ్ళు ఆ గోపురాన్ని కట్టడం దేవునికి ఇష్టం లేదు. ఆ గోపురం కట్టడం వెనుక వాళ్ళు ఉద్దేశమంతా కేవలం వాళ్ళెంత గొప్పవాల్లో చుపించుకోవడమే నని ఆయనకు తెలుసు . గనుక దేవుడు వచ్చి, వాళ్లందరికి కొత్త భాషను ఇచ్చి ఆ పనిని ఆపేశాడు. ప్రజలందరు ఒక్కసారిగా గందరగోళంలో పడ్డారు. ఎందుకంటే ఒకరికి ఒకరు అకస్మాత్తుగా ఎవరు ఏం మాట్లాడుతున్నారో అర్ధం కావటం లేదు. ఒకరితో ఒకరు ఏం చెప్తున్నారో తెలియక వాళ్ళు కలిసి పని చేయకలేకపోయారు అంతటిలో వాళ్ళు ఆ పధకాన్ని వదిలేసారు. ఆ గోపురం ఇక ఎన్నటికీ పూర్తి కాలేదు.
ఆదికాండము 11
-నవీన్ కుమార్ యెలుమర్తి -
గుర్తుపెట్టుకుంటారు ."

ఆదికాండము 11
-నవీన్ కుమార్ యెలుమర్తి -
No comments:
Post a Comment