వర్షం ఆగిపోయాక ఓడ దాదాపు 6 నెలలు పాటు నీళ్ల మీదనే చుట్టూ తిరుగుతూ ఉంది . నీళ్లు కొద్దిగా ఎండిపోయాయి గనుక ఇప్పుడు మళ్ళి కొండ శిఖరాలు కనబడుతున్నాయి అయితే లోయలు , పెద్ద పెద్ద అడవులు నిండా ఇంకా నీళ్లు ఉన్నాయి. ఒక రోజు ఓడ ఆరారాతు అనే పర్వతం ప్రక్కన ఆరిన నేలను తాకింది .
ఒక వారం తరువాత నోవహు మరొకసారి ఆ పావురాన్ని బయటకి వదిలాడు అయితే ఈ సారి పావురం వెనక్కి తిరిగి రాలేదు , గనుక నోవహుకు తెలుసు, ఇక ఓడను విడచి బయటకు రావాల్సిన సమయం వచ్చేసింది అని. అప్పుడు దేవుడు "జలప్రళయం అయిపోయింది గనుక ప్రతి ఒక్కరూ ఓడను విడిచి బయటకు రావచ్చు" అని చెప్పాడు, నోవహు జంతువులన్నీ బయటకు పంపేశాడు . అవి వాటికోసం ఎదురు చూస్తున్న కొత్త ప్రపంచంలోకి వెళ్ళడానికి ఎంతో ఉత్సహంగా ఉన్నాయి .
ఇప్పటికి, ఆ తరవాత ఎపుడైనా వర్షం వచ్చినా, ఆకాశంలో నల్లమబ్బులు కమ్మినా, నోవహు అతని కుటుంబము కాస్త చింతిస్తూ ఉండేవారు. అయితే దేవుడు వాళ్లకు చేసిన వాగ్దానాన్ని ఎన్నడూ మరువలేదు, వర్షం వెళ్ళిపోయాక సూర్యుడు మబ్బుల్ని చీల్చుకుని ప్రకాశించే సమయములో ప్రకాశవంతముగా మెరిసే రంగుల హరివిల్లు కనబడుతుంది వాళ్ళు క్షేమముగా ఉన్నారు, దేవుడు తన వాగ్దానాన్ని నిలబెట్టుకుంటాడు ఎల్లప్పుడూ! ఆదికాండము 6-2
నోవహు ఓడలో నుండి ఒక కిటికీ తెరచి ఒక నల్ల కాకిని బయటకు పంపాడు. ఆ పక్షిని అతడు బయటకి ఎగిరి పోయేలా చేసాడు కానీ దానికి ఆరిన నేల ఎక్కడా కనపడనందున అది వెంటనే నోవహు దగ్గరికి తిరికి వచ్చేసింది. ఆ తర్వాత నీళ్లు ఎండిపోయాయి లేదో తెలుసుకోడానికి నోవహు మరల ఒక పావురాన్ని బయటకు పంపాడు. క్రిందకి దిగడానికి స్థలము లేక అది కూడా మరల తిరిగి వచ్చేసింది .

తన కుటుంబాన్ని, జంతువులన్నిటిని క్షేమముగా కాపాడినందుకు నోవహు దేవున్ని ఆరాధించడానికి బలిపీఠం కట్టాడు. అప్పుడు దేవుడు నోవహు అతని కుమారులను దీవించి ఇలా అన్నాడు, "ఈ రోజు నేను మీకు ఒక వాగ్దానం చేస్తున్నాను. ఆకాశంలో నేను ఏర్పపాటు చేసిన ఇంద్రధనస్సును చుడండి. నేను మరల ప్రపంచాన్ని వరదలతో నాశనం చ్చెయ్యను అనడానికి ఇ ది మీకు ఒక సూచినిగా ఉంటుంది ."

-నవీన్ కుమార్ యెలుమర్తి -
No comments:
Post a Comment