యాకోబుకి పన్నెండు మంది కుమారులు , ఒక కూతురు ఉన్నారు. యేసేపు అతని చిన్న కొడుకుల్లో రెండోవాడు. యేసేపు అంటే యాకోబుకు ఎంతో ఇష్టం. కాబట్టి యేసేపు కోసం యాకోబు ఒక అందమైన కోటు తయారుచేశాడు. ఆ కోటు చాలా ఖరీదైనది గనుక యేసేపు యొక్క ఆ ప్రత్యేకమైన కోటు తన అన్నలకు ఎంతో అసూయ పుట్టించింది.
యేసేపుకు చాలా కలలు వచ్చాయి. ఒక రోజు యేసేపు ఒక కల కన్నాడు. అందులో అతడు, అతని అన్నలు గోధుమ పనలు కోస్తున్నారు. వాటన్నిటిని తన కట్టలు కట్టారు. అయితే యేసేపు అన్నల కట్టలు తన కట్టలకు నమస్కారం చేశాయి .
మరొకసారి యేసేపు సూర్యుడిని, చంద్రుడిని పన్నెండు నక్షత్రాలను చూచినట్లు కలగన్నాడు, ఆ నక్షత్రాలలో ఒకటి యేసేపుది కాగా, తక్కిన నక్షత్రాలన్నీ యేసేపు నక్షత్రానికి నమస్కారం చేశాయి. యేసేపు తన కొచ్చిన కలలు గురించి తన అన్నలకు చెప్పినప్పుడు వాళ్ళు చాలా కోప్పడ్డారు. ఎందుకంటే వాళ్ళకు అతని కలలు నచ్చలేదు. వాళ్ళన్నారు, " అయితే నీవు మా తమ్ముడు అయినప్పటికీ మేమంతా నీ ముందు సాగిలపడటం నీకు బాగానే ఉందనుకుంటున్నావా? ఇలాంటి కలలు ఇంకా కంటూనే ఉండరా చిట్టి తమ్ముడూ."
ఒక రోజు , యేసేపు , అతని అన్నలు ఇంటికి చాలా దూరంగా ఉన్నప్పుడు, వాళ్ళు యేసేపును పట్టుకుని అతని అంగీలు చింపేసి, ఒక నీళ్లులేని బావిలో పడేశారు. ఆ దారి వెంట కొంతమంది వ్యాపారస్తులు వెళ్తుంటే, అన్నలు యేసేపును పైకి లాగి, ఆ మనుషులకు అతన్ని బానిసగా అమ్మేశారు. వాళ్ళు ఐగుప్తునికి ప్రయాణిస్తున్నారు, చివరికి అక్కడే యేసేపు ఒక బానిసగా అయ్యాడు. అయితే దేవుడు యేసేపుని మరచిపోలేదు, ఆయన అతన్ని కాపాడినాడు.
ఆదికాండము 37-47
-నవీన్ కుమార్ యెలుమర్తి -
No comments:
Post a Comment