చివరికి, యాకోబు లాబాను ఇంటికి చేరుకున్నాడు. లాబాను చాలా ధనవంతుడు, అతనికి వందలాది గొర్రెలు,మేకలు ఆవులు ఉన్నాయి. యాకోబు లాబాను దగ్గర పనిచేస్తూ, అతని పశువులు మేపుతూ 20 సంవత్యరాలు గడుపుతాడు. లాబాను ఇద్దరు కూతుళ్లు అయిన రాహేలు,లేయాలను కూడా యాగోబు పెళ్లి చేసుకుంటాడు, అతనికి మొత్తం మీద పండ్రెండు మంది పిల్లలు పుడతారు. యాకోబు చాలా ధనవంతుడవుతాడు, అనేక ఆవులు గొర్రెలు మేకలు సంపాదిస్తాడు
అయితే ఏశావు యాకోబును క్షమించాడు. యాగోబును కలవడానికి అతడు పంపిన మనుషులు కేవలం యాకోబు మందలకు సహాయంగా ఉంటారని పంపాడు. ఏశావు యాకోబును చూడగానే పరిగెత్తుకుంటూ,వెళ్లి అతన్ని కౌగలించుకుని ముద్దుపెట్టుకున్నాడు.
ఆదికాండము 25-33
అయితే యాకోబు తిరిగి కనాను వెళ్లాలనుకుంటాడు. అతడు మరల తన అన్నతోను, కుటుంబముతోను ఉండాలని ఆశిస్తాడు. యాకోబు మరల ఇంటికి వస్తున్నాడని తెలిసిన ఏశావు యాకోబుకు ఒక వర్తమానం పంపిస్తాడు.
''నేను నాలుగు వందల మందిని తీసుకుని వస్తున్నాను" అని యాకోబుకు చెప్పి పంపిస్తాడు. ఏశావు ఇంకా నా మీద కోపంతోనే ఉన్నాడని యాకోబు భయపడ్డాడు. కాబట్టి అతడు తన సేవకులతో ఏశావుకు కొన్ని బహుమానాలు పంపిస్తాడు అలాగైనా తన అన్న కోపం చల్లారుతుందనే ఆశతో .
అయితే ఏశావు యాకోబును క్షమించాడు. యాగోబును కలవడానికి అతడు పంపిన మనుషులు కేవలం యాకోబు మందలకు సహాయంగా ఉంటారని పంపాడు. ఏశావు యాకోబును చూడగానే పరిగెత్తుకుంటూ,వెళ్లి అతన్ని కౌగలించుకుని ముద్దుపెట్టుకున్నాడు.
వాళ్లిదరు ఏడ్చారు, యాకోబు ఏశావుని మోసం చేసి, అతనికి విపరీతమైన కోపం తెపించినా, ఏశావు అతన్ని క్షేమించి తన తమ్ముడిని మరల చూడగలిగినందుకు చాలా సంతోషించాడు. అతడు మరల వాళ్ళు కుటుంబమంతా కలిసి ఉండాలని కోరుకున్నాడు .
ఆదికాండము 25-33
-నవీన్ కుమార్ యెలుమర్తి
No comments:
Post a Comment