ఐగుప్తులో, బానిసగా ఉన్న యేసేపు కొంత కాలములోనే చెరసాల పాలయ్యాడు. తోటి ఖైదీలలో ఒకడు రాజు గారితో కలసి అతి సన్నితంగా పనిచేసేవాడు. ఒక రాత్రి అతనికి ఒక కల వచ్చింది, దాన్ని అతడు యేసేపుతో చెప్పాడు. దాని భావమేమిటో యేసేపుకు తెలుసు. గతంలో నీవు రాజుగారి ప్రత్యేక సేవకుడివి. నీ కలకు అర్ధమేమిటంటే, త్వరలోనే నీవు మరల అతని సేవకుడవు అవుతావు "
మూడు రోజుల తరువాత, యేసేపు చెప్పినట్లే జరిగింది అతడు విడుదల చేయబడి రాజుగారికి సేవలు చేయడానికి తిరిగి రాజ భవనానికి వెళ్ళిపోయాడు.
రెండేళ్లు గడచిపోయాయి. అయితే యేసేపు ఇంకా చెరసాలలో ఉండిపోయాడు. ఆ సమయంలో ఐగుప్తు రాజుకి కొన్ని వింత కలలు వచ్చాయి. అవి అతడినెంతో బయపెట్టాయి. ఒక రోజు రాత్రి రాజు గారు నైలు నది ఒడ్డున నిలబడి నట్లు కల కన్నాడు. హఠాత్తుగా నదిలో నుండి బలిసిన ఆవులు బయటకొచ్చాయి. వాటిని బక్క చిక్కిన ఆవులు తినేశాయి. కొంత సేపటి తరువాత అతనికి అతనికి మరొక కల వచ్చింది. అతడు ఏడు మొక్కజొన్న కంకులను చూశాడు. అవి చాలా మందంగా గింజలతో నిండి ఉన్నాయి. అయితే బాగా ఎండిపోయిన సన్నగా ఉన్న ఏడు కంకుల్ని కుడా చూశాడు. అప్పుడు పలుచటి కంకులు మందంగా ఉన్న కంకుల్ని తినేశాయి.
రాజు గారు ఈ కలలకు అర్థమేమిటో నిజంగా తెలుసుకోవాలనుకున్న్నాడు అప్పుడు ఆ సేవకుడు తాను చెరసాలలో కలిసిన యేసేపుని జ్ఞాపకం చేసుకున్నాడు. చెరసాల నుంచి యేసేపుని రాజుగారి ఎదుటకు తీసుకొచ్చారు. యేసేపు వెంటనే ఆ కలల భావన అర్ధం చేసుకొని వాటిని రాజుగారికి వివరించాడు. "త్వరలో సంభవించబోయే సంగతులు గురించి మీరు కలలు కంటున్నారు. వాటి అర్ధం ఇది. మొదట ఐగుప్తులో ఏడు సంవత్యరాలపాటు తినడానికి బోలుడంత ఆహారం ఉంటుంది. ఆ తర్వాత, ఏడు సంవత్యరాలు అసలు పంటలే పండని చెడు సంవత్యరాలు వస్తాయి."
యేసేపు మరొక సలహా కూడా ఇచ్చాడు. రాజుగారి పెద్ద గిడ్డంగులు కట్టి, మంచి సంవత్యరాలలో పండే అదనపు ధాన్యమంతా సేకరించి దాచిపెట్టాలని, అలా చేయడం వలన కరువు సంవత్యరాలు వచ్చినప్పుడు అందరికి ఆహారం దొరుకుతుందని చెప్పాడు. యేసేపు చెప్పిన యోచన రాజుగారికి నచ్చింది. కాబట్టి మంచి సంవత్యరాలలో వీలైనంత ఎక్కువ ధాన్యం సేకరించడానికి యేసేపునే నియమించాడు. అప్పుడు యేసేపు
ఐగుప్తులో బలమైన నాయకుడు .
ఐగుప్తులో బలమైన నాయకుడు .
ఆదికాండము 37-47
-NAVEEN KUMAR YELUMARTHI -
-NAVEEN KUMAR YELUMARTHI -
No comments:
Post a Comment